‘ఇంటర్మీడియెట్‌ పూలింగ్‌’పై నిషేధం

Published on Tue, 10/05/2021 - 08:10

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడే దిశగా నిధులు, యూనిట్ల ’ఇంటర్మీడియట్‌ పూలింగ్‌’ను నిషేధించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది. మ్యుచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ సలహాదారులు, చానెల్‌ భాగస్వాములు, ప్లాట్‌ఫామ్‌లు తదితర సంస్థలకు ఇది వర్తిస్తుంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సెబీలో నమోదు చేసుకున్న పోర్ట్‌ఫోలియో మేనేజర్లకు ఇది వర్తించదు. 

మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల (ఏఎంసీ)తో లోపాయికారీ ఒప్పందాలతో కొన్ని సంస్థలు .. తమ క్లయింట్ల నిధులను ముందు నోడల్‌ ఖాతాలోకి (ఇంటర్మీడియట్‌ పూలింగ్‌), ఆ తర్వాత ఏఎంసీల ఖాతాల్లోకి లావాదేవీల ప్రాతిపదికన బదలాయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సెబీ తెలిపింది. ఇలాంటి అనధికారిక లావాదేవీల వల్ల యూనిట్‌హోల్డర్లు నష్టపోతే ఏఎంసీలే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.   
 

చదవండి : కోటీశ్వరులయ్యే మంత్రం చెప్పిన బాబా రామ్‌దేవ్‌.. సెబీ సీరియస్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ