Breaking News

ఆరేళ్ల గరిష్టానికి పీ–నోట్‌ పెట్టుబడులు

Published on Sat, 10/28/2023 - 05:26

న్యూఢిల్లీ: దేశ క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ–నోట్లు) రూపంలో పెట్టుబడులు ఆరేళ్ల గరిష్టానికి చేరాయి. సెపె్టంబర్‌ చివరికి ఇవి రూ.1.33 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా ఏడో నెలలోనూ వృద్ధి చెందాయి. 2017 జూలై తర్వాత పీనోట్‌ పెట్టుబడులు గరిష్ట స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. నాడు ఇవి రూ.1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. సెబీ గణాంకాలను పరిశీలించినప్పుడు ఈ వివరాలు తెలిశాయి.

సెబీ వద్ద నమోదు చేసుకోకపోయినా, పీ నోట్‌ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల భారత క్యాపిటల్‌ మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పీ–నోట్లను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) జారీ చేస్తారు. పీ–నోట్ల ద్వారా ఈక్విటీ, డెట్, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో చేసిన పెట్టుబడులు సెప్టెంబర్‌ ఆఖరుకి రూ.1,33,284 కోట్లుగా ఉన్నాయి. ఇందులో రూ.1.22 లక్షల కోట్లు ఈక్విటీల్లో ఉండగా, డెట్‌లో రూ.10,688 కోట్లు, హైబ్రిడ్‌ సెక్యూరిటీల్లో రూ.389 కోట్ల చొప్పున ఉన్నాయి.

జూలై చివరికి ఇవి రూ.1.23 లక్షల కోట్లు, జూన్‌ చివరికి రూ.1.13 లక్షల కోట్లు, మే చివరికి రూ.1.04 లక్షల కోట్లు, ఏప్రిల్‌ చివరికి రూ.95,911 కోట్ల చొప్పున ఉన్నాయి. పీ నోట్‌ పెట్టుబడులు సాధారణంగా ఎఫ్‌పీఐల పెట్టుబడుల సరళినే అనుసరిస్తుంటాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుండడం పీ–నోట్‌ పెట్టుబడుల్లో వృద్ధికి దారితీస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా సెబీ వద్ద నమోదు చేసుకోకుండా ఇన్వెస్ట్‌ చేసుకునే సౌలభ్యం ఉండడం కూడా సానుకూలిస్తున్నట్టు చెబుతున్నారు. రానున్న సంవత్సరాల్లోనూ పీనోట్‌ పెట్టుబడుల రాక కొనసాగుతుందన్న అంచనా వ్యక్తం చేస్తున్నారు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు