amp pages | Sakshi

ప్రపంచ ఎకానమీ రికవరీపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీల‌క వ్యాఖ్య‌లు

Published on Fri, 02/18/2022 - 14:04

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక రికవరీకి వీలుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సిన్ల పంపిణీ తగిన సమాన స్థాయిలో వేగంగా జరగాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపు నిచ్చారు. మహమ్మారిపై పోరాటంలో భారతదేశం అనుసరించిన విధానాలను ఆమె గుర్తుచేసుకుంటూ,  దీర్ఘకాలిక దృష్టితో ఎకానమీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండోనేషియా నేతృత్వంలో జరిగిన జీ20 ఆర్థికమంత్రులు, సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్ల మొదటి వర్చువల్‌ ప్యానల్‌ సమావేశాన్ని ఉద్దేశించి ఆర్థిక మంత్రి ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు.

అంతర్జాతీయంగా చూస్తే మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాల మధ్య కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ మేరకు ఉన్న అసమతౌల్యతలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. జీ20 జాయింట్‌ ఫైనాన్స్, హెల్త్‌ టాస్క్‌ ఫోర్స్‌ కార్యాచరణ ఈ దిశలో పురోగమించలని అన్నారు. 

ద్రవ్యోల్బణం, సరఫరాల సమస్యలు, కొత్త వేరియెంట్ల భయాలు వంటి అంశాలుసహా అంతర్జాతీయ ఆర్థిక అవుట్‌లుక్‌కు సంబంధించి ఆర్థికమంత్రి పలు అంశాలను సమావేశంలో ప్రస్తావించారని ఆర్థిక శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనే దిశలో పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆమె ఉద్ఘాటించినట్లు ఆర్థికశాఖ ట్వీట్‌ తెలిపింది.  

బహుళజాతి సంస్థల తోడ్పాలు అవసరం 
భవిష్యత్తులో మహమ్మారి పరిస్థితులను ఎదుర్కొనడానికి బహుళజాతి సంస్థల పాత్ర ఎంతో ఉందని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దిగువ, మధ్య ఆదాయ దేశాలకు ఇందుకు సంబంధించి బహుళజాతి సంస్థలు మరిన్ని నిధులను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయా దేశాలు మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, అంతర్జాతీయంగా ఫైనాన్షియల్‌ మద్దతు కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. మహమ్మారి సవాళ్లు భారత్‌కూ ఇబ్బందులను సృష్టించాయని అన్నారు. 

ఆరోగ్య మౌలిక లక్ష్యాల దిశలో ఒక్క భారతదేశమే 29 బిలియన్‌ డాలర్లను కేటాయించిందని ఆమె పేర్కొన్నారు. ‘‘బహుళజాతి బ్యాంకులు దిగువ, మధ్య ఆదాయ దేశాలకు తమ నిధులను పెంచాలి. సవాళ్లు పరిష్కారం, సుస్థిర పరిస్థితులు నెలకొల్పడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రతిపాదిస్తున్న 50 బిలియన్‌ డాలర్ల ట్రస్ట్‌ (ఆర్‌ఎస్‌టీ) మహమ్మారి సంక్షోభాలపై దృష్టి సారించాలా చర్యలు ఉండాలి’’ అని ఆమె అన్నారు. దేశాలకు దీర్ఘకాలికంగా తగిన ఫైనాన్షియల్‌ మద్దతు అందించడం ఆర్‌ఎస్‌టీ ప్రధాన లక్ష్యం కావాలని సూచించారు.  నిధుల సమీకరణకు రోడ్‌మ్యాప్‌ ఇవ్వడంలో జీ20 నియమించిన కమిటీ ప్రశంసనీయమైన పాత్ర పోషించిందని పేర్కొన్న ఆమె,  జఅధికారిక అభివృద్ధి సహాయం (ఓడీఏ)తో సహా ఇతర మార్గాలతో వనరుల సమస్యను పరిష్కరించవచ్చని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తన సామర్థ్యాన్ని మరింత విస్తరించాలని, వనరులను సమీకరించడంసహా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించడానికి నిర్మాణాత్మక అడ్డంకులను తొలగించాల్సి ఉంటుందని అన్నారు. ‘‘ప్రపంచ ప్రజా సంక్షేమానికి మనమందరం పరస్పరం సహకరించవలసి ఉంటుందని తొలుత గుర్తించాలి. ప్రపంచ దేశాలు చేయి చేయి కలిపి నడవడం మన ముందు ఉన్న ఒక కీలక మార్గం’’ అని ఆమె సమావేశంలో పేర్కొన్నారు.

Videos

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి

విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!

Aditi Rao Hydari: సిద్దార్థ్ తో ఎంగేజ్మెంట్

ఇది క్లాస్ వార్..దద్దరిల్లిన నరసాపురం

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ 31 మూవీ క్రేజీ అప్డేట్

అవ్వా, తాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్ రియాక్షన్..

నరసాపురం జనసంద్రం

రాష్ట్రంలో ముగ్గురు మూర్ఖులు ఉన్నారు: నాగార్జున యాదవ్

చంద్రబాబుపై ఫైర్

Photos

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)