అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారు!

Published on Thu, 11/11/2021 - 21:07

ప్రముఖ సౌత్ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ప్రపంచంలో తన సత్తా చాటేందుకు సిద్దం అయ్యింది. తన కొత్త తరం ఈవీ9ను నవంబర్ 17న లాస్ ఏంజిల్స్ లో జరిగే ఆటో షోలో ప్రారంభించనున్నారు. అయితే, అరంగేట్రానికి ముందు కియా అధికారికంగా తన కాన్సెప్ట్ ఈవీ9 టీజర్ చిత్రాన్ని విడుదల చేసింది. ఈ ఎస్‌యువి కారు విషయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ ఉంది. కియా కొత్త ఈవీ9 డిజైన్ చూస్తే సరికొత్తగా ఉంది. ఈవీ కారు ఫ్లాట్ రూఫ్ లైన్, పెద్ద వీల్ ఆర్చ్, స్లిమ్ ఎల్ఈడి డిఆర్ఎల్ సెక్షన్, ప్రముఖ ఫ్రంట్ గ్రిల్ తో వస్తుంది. 

ఈ కియా కొత్త కాన్సెప్ట్ ఈవీ9 బ్రాండ్ కారు ఇతర ఈవి కంటే పెద్దదిగా ఉంది. అమెరికాలో బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే ఈవి అమ్ముడైంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఎస్‌యువి 400వీ,  800వీ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువి కారును. ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో చార్జ్ చేస్తే ఐదు నిమిషాల్లోనే ఈవీ6 112 కిలోమీటర్లు, 18 నిమిషాలు చార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు అని కియా పేర్కొంది. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిమీ వెళ్లనుంది. ఇది 77.4కెడబ్ల్యుహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ కారు ధర రూ.44 లక్షలుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిని ఇండియాలోకి తీసుకొని వస్తారో లేదా అనే విషయంపై స్పస్టత లేదు. 

(చదవండి: ఎస్‌బీఐ వినియోగదారులకు అలర్ట్!)

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ