తప్పు చేశాడు.. ఫలితం అనుభవిస్తున్నాడు..

Published on Tue, 03/08/2022 - 08:33

న్యూఢిల్లీ: అక్రమాలకు పాల్పడిన కంపెనీ సహవ్యవస్థాపకుడు అష్నీర్‌ గ్రోవర్‌ను పదవి నుంచి తొలగించే విషయంలో బోర్డు వేగంగా, నిర్ణయాత్మకంగా వ్యవహరించినట్లు భారత్‌పే సహవ్యవస్థాపకుడు శాశ్వత్‌ నక్రానీ పేర్కొన్నారు. పీడబ్ల్యూసీ నివేదికను అందుకున్నాక బోర్డు తగిన విధంగా స్పందించినట్లు ఉద్యోగులకు రాసిన లేఖలో తెలియజేశారు. 

కంపెనీలో కార్యకలాపాలలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో గత వారం గ్రోవర్‌ను అన్ని పొజిషన్ల నుంచీ తప్పించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా చట్టపరమైన చర్యలకు సైతం ఉపక్రమించనున్నట్లు భారత్‌పే బోర్డు వెల్లడించింది. అష్నీర్‌ గ్రోవర్‌ కంపెనీ ఉద్యోగిగా ఇకపై భారత్‌పేతో ఎలాంటి సంబంధాలూ కలిగి ఉండరని శాశ్వత్‌ లేఖలో పేర్కొన్నారు. కంపెనీ సహవ్యవస్థాపకుడు లేదా డైరెక్టర్‌గా ఉండబోరని తెలియజేశారు. 

ఈ నెల 1 అర్ధరాత్రి గ్రోవర్‌ బోర్డుకి రాజీనామా చేసినట్లు ప్రస్తావించారు. గ్రోవర్‌ కుటుంబం, ఇతర బంధువులు కంపెనీ నిధులను దుర్వినియోగం చేయడంతోపాటు పలు అక్రమాలకు పాల్పడినట్లు లేఖలో వివరించారు. కంపెనీపట్ల తప్పుడు వివరణ ఇచ్చేందుకు గ్రోవర్‌ ప్రయత్రించినట్లు తెలియజేశారు. 
 

చదవండి: Bharatpe: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్‌ అయిపోయింది

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ