amp pages | Sakshi

త్వరలో శ్రీవారి ఆర్జిత సేవలు

Published on Fri, 02/18/2022 - 05:50

తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ నిబంధనలను సడలించడంతో ఆర్జిత సేవలను సడలించింది. సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్య క్రమంగా పెంచాలని నిర్ణయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్ల అంచనాలతో రూపొందించిన టీటీడీ బడ్జెట్‌ను ఆమోదించింది. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బడ్జెట్‌ ఆమోదంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు జరిగిన ప్రచారం ఆవాస్తవమని చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు.. 

► సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం. త్వరలో సీఎం జగన్‌చే భూమిపూజ. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. 
► తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం. 
► టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యానికి రూ.25 కోట్లతో నిధి ఏర్పాటు. 
► తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిబంధనల మేరకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం. 
► తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద భవనంలో స్టీమ్‌ ద్వారా అన్నప్రసాదాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్, డీజిల్‌ ద్వారా కేజి స్టీమ్‌ తయారీకి రూ.4.71 ఖర్చవుతోంది. సోలార్‌ సిస్టమ్‌ ద్వారా రెస్కో మోడల్‌ స్టీమ్‌ను కేజి రూ.2.54కు 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి నెడ్‌క్యాప్‌తో ఒప్పందం. తద్వారా టీటీడీకి ఏడాదికి దాదాపు రూ.19 కోట్ల ఆదా. 
► తిరుమలలో హోటళ్లు, ఫాస్టు ఫుడ్‌ సెంటర్లు తొలగించి, అన్ని ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్న ప్రసాదాలు అందించాలని నిర్ణయం. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందిస్తారు. ఇక్కడి వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు ఇస్తారు. 
► అలిపిరి వద్ద సైన్స్‌ సిటీకి మంజూరు చేసిన 70 ఎకరాల్లో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మాణం. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన. ఇందులో సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పురాణాల లైవ్‌ షోలు వంటివి ఉండనున్నాయి. 
► అన్నమయ్య మార్గాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు 
► టీటీడీ ఆయుర్వేద ఫార్మసీకి రూ.3.60 కోట్లతో పరికరాలు కొనుగోలు. రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులోకి. 
► శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయం. క్రేన్‌ సాయంతో గోపురం బంగారు తాపడంపై ఆగమ పండితులతో చర్చించాలని అధికారులకు ఆదేశం. 
► పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్, కమిషనర్‌ హరి జవహర్‌లాల్, అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, పోకల ఆశోక్‌ కుమార్, సనత్‌కుమార్, మారుతీ ప్రసాద్, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి,  మధుసూదన్‌ యాదవ్, సంజీవయ్య, విశ్వనాథ్, శ్రీ రాములు, విద్యాసాగర్, మల్లీశ్వరి, శివకుమార్, ఢిల్లీ, చెన్నై  స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శేఖర్‌ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్‌ జెట్టి  తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ధర్మ ప్రచార పరిషత్‌ కార్యనిర్వాహక మండలి సమావేశంలో శ్రీనివాస వ్రత విధానం పుస్తకాలు ముద్రించి భక్తులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)