ఆడుకుంటూ.. అనంతలోకాలకు.. 

Published on Sat, 01/16/2021 - 09:07

బద్వేలు అర్బన్‌: మున్సిపాలిటీ పరిధిలోని మడకలవారిపల్లెలో పండుగ పూట విషాదం నెలకొంది. మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ.. అనంతలోకాల కు వెళ్లాడు. వేడిపాలు ఉంచిన దబరాలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వివరాల్లోకి వెళితే.. మడకలవారిపల్లెకు చెందిన కొప్పరపు సురేష్, శ్రావణి దంపతులకు ఇద్దరు పిల్లలు. వారు కుటుంబ సమేతంగా రెండు రోజుల క్రితం బి.మఠం మండలం పలుగురాళ్ళపల్లెలో బంధువుల శుభకార్యానికి వెళ్లారు. అక్కడ భోజనాల నిమిత్తం పెరుగు కోసం పాలను వేడి చేసి, పెద్ద పాత్రలో పోసి చల్లార్చేందుకు ఉంచారు. ఈ సమయంలో సురేష్‌ చిన్న కుమారుడైన ప్రణీత్‌ (3) ఆడుకుంటూ వెళ్లి వేడి పాలలో పడిపోయాడు. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు. అయితే కోలుకోలేక శుక్రవారం ఉదయం బాలుడు మృతి చెందాడు.   

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ