పారిశుద్ధ్య కార్మికుల పెద్ద మనసు

Published on Fri, 07/31/2020 - 08:23

నల్లమాడ: భార్య, కుమారుడు ఇతర కుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడి హోం క్వారంటైన్‌లో ఉండిపోయారు. అనారోగ్యంతో 10 రోజులుగా మంచాన పడిన కుటుంబ పెద్ద గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. కుటుంబ సభ్యులు బయటకు రాకూడని పరిస్థితి. దీంతో అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందే బంధువులై మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వివరాలు..స్థానిక వైఎస్సార్‌ కూడలిలో నివాసం ఉండే రిటైర్డ్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ బి.రంగనాయకులు (77) అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు.

అప్పటికే ఆయన భార్య, కుమారుడు, కోడలితో పాటు మరో ముగ్గురు సమీప బంధువులకు కరోనా వైరస్‌ సోకడంతో మొత్తం ఆరుగురు మూడు రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, వీఆర్‌ఓ చంద్రశేఖర్, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ పొరకల రామాంజనేయులు పెద్దకోట్లపల్లికి వెళ్లే రహదారిలోని శ్మశాన వాటికలో గుంత తవ్వించి, మృతదేహాన్ని పూడ్చిపెట్టి హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు , ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.  
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ