రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ: రూ.6,400 కోట్ల వ్యయంతో రోడ్లు అభివృద్ధి
Published on Mon, 07/26/2021 - 18:52
సాక్షి, విజయవాడ: రూ.6,400 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెండేళ్లలో పనులు పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కాంట్రాక్టర్లకు నమ్మకం ఉండేలా ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరుస్తామని పేర్కొన్నారు. మూడు బ్యాంకులు లోన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
మరమ్మత్తులు చేసిన బిల్లులు దాదాపు చెల్లించడం జరిగిందన్నారు. గత ఏడాది రూ.600 కోట్లు బిల్లులు చెల్లించామన్నారు. వారం, పది రోజుల్లో బీఆర్ఓ తాలూక సొమ్ము విడుదలవుతుందన్నారు. నెలవారీగా బిల్లులు ఇవ్వడానికి సీఎం ఆదేశించారన్నారు. ఈ ఏడాది రోడ్ల మరమ్మత్తులకు రూ. 410 కోట్లు బడ్జెట్లో ఏర్పాటు చేశారని కృష్ణబాబు పేర్కొన్నారు.
#
Tags