amp pages | Sakshi

ఇళ్ల నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

Published on Wed, 12/01/2021 - 02:58

సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం కింద 30 లక్షల మంది లబ్ధిదారులకు ఇచ్చిన స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దంటూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుతో ఆగిపోయిన ఇళ్లకు అడ్డంకులు తొలగిపోయాయి. ఇళ్ల స్థలాల మంజూరులో పలు మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ సింగిల్‌ జడ్జి ముందు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 128 మంది పిటిషనర్లు మంగళవారం హైకోర్టు ధర్మాసనానికి నివేదించారు. దీంతో పేదల ఇళ్ల నిర్మాణం కొనసాగనుంది.

తమకు వివాదాలు వద్దని, ఇళ్ల పట్టాలు వస్తే చాలని వారు ధర్మాసనానికి తెలిపారు. పిటిషనర్లలో కొందరికి ఇప్పటికే పట్టాలు మంజూరు చేశామని, మిగతా వారు దరఖాస్తు చేసుకుంటే వారికీ ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నందున, ఆ మేరకు  ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతినిచ్చింది.  పిటిషనర్లు వ్యాజ్యం ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ పూర్వాపరాల్లోకి వెళ్లడంలేదని స్పష్టంచేసింది.

సింగిల్‌ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవీ ఏ ఒక్కరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని తేల్చి చెప్పింది. పట్టాలు కోరుకొనే పిటిషనర్లు మూడు వారాల్లో దరఖాస్తు చేసుకోవాలని, వాటిని మూడు నెలల్లో పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

ముఖ్యమంత్రి ఆదేశాల మేర అప్పీల్‌ దాఖలు 
‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దంటూ సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సత్యనారాయణమూర్తి గత నెలలో తీర్పునిచ్చారు. దీంతో పనులు నిలిచిపోయాయి. ఈ తీర్పు వల్ల పేదలు తీవ్రంగా ప్రభావితమైనందున, అప్పీల్‌ దాఖలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సింగిల్‌ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు.

ఈ అప్పీల్‌పై జస్టిస్‌ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సింగిల్‌ జడ్జి ముందు పిటిషన్‌ దాఖలు చేసిన 128 మంది పిటిషనర్ల తరఫున సీనియర్‌  న్యాయవాది వీఎస్‌ఆర్‌ ఆంజనేయులు తాము వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరింది. పిటిషన్‌ ఉపసంహరణకు తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్, అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తెలిపారు.

పట్టాలు ఇవ్వడానికి కూడా అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. సింగిల్‌ జడ్జి తీర్పును ఉపసంహరించాలని కోరారు. సింగిల్‌ జడ్జి తీర్పులో ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) గురించి ప్రస్తావనలు చేశారని, దీనివల్ల ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌  ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సింగిల్‌ జడ్జి తీర్పులో ప్రస్తావించిన అంశాలేవీ ఎవరి పట్ల ఏ రకంగానూ ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించవని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అసలుకే మోసం వస్తుందనే పిటిషన్‌ ఉపసంహరణ?
సింగిల్‌ జడ్జి ముందు పిటిషన్‌ దాఖలు చేసిన వారిలో చాలా మందికి అంతకు ముందే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది. మరికొందరు పిటిషనర్ల చిరునామాలు కూడా లభించలేదు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాజ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యాజ్యం వెనుక ఎవరో ఉన్నారని, దీనిపై లోతుగా విచారణ జరపడం మేలన్న వాదన కూడా వినిపించింది. ఈ వ్యవహారంపై  లోతుగా విచారిస్తే అసలుకే మోసం వస్తుందన్న ఉద్దేశంతోనే పిటిషనర్లు వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)