amp pages | Sakshi

దెబ్బతిన్న పంటకు సర్కారు భరోసా

Published on Sat, 11/14/2020 - 03:01

సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వేరుశనగ, పత్తి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో ముందుకు వచ్చింది. పత్తిలో అధిక తేమ, వేరుశనగలో గింజ నాణ్యత (శాతం) పడిపోవడం వల్ల రైతులు మద్దతు ధరకు అమ్ముకోలేక ఆందోళన చెందుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల అమ్మకానికి సంబంధించి నిబంధనలు సడలించింది. ఇప్పటి వరకు ఉన్న టైం స్లాట్‌ విధానంలో పేర్కొన్న తేదీ, సమయానికే రైతులు పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలి. పొరపాటున ఆ సమయానికి తీసుకెళ్లలేకపోతే మళ్లీ తమ పేరును ఆర్బీకేలో నమోదు చేసుకుని, ఆ తేదీ వరకు నిరీక్షించాలి.

ఈ ఇబ్బందిని గమనించిన ప్రభుత్వం అందులో కొంత వెసులుబాటు కల్పించింది. దీంతో రైతులు ఆ సీజన్‌లో ఎప్పుడైనా పంట వివరాలను నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆధార్, పట్టాదారు పుస్తకం, బ్యాంకు పాస్‌ పుస్తకం జిరాక్స్‌ కాపీలతో వచ్చి పేరు నమోదు చేసుకోవాలి. కొత్త నిబంధన ప్రకారం రైతులు ఏ రోజున పంట అమ్ముకోవాలని భావిస్తారో అదే రోజున కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లొచ్చు. అక్కడి అధికారులు నాణ్యతను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉంటే వెంటనే కొనుగోలు చేస్తారు. నాఫెడ్‌ నిబంధనల ప్రకారం నవంబర్‌లో రైతు పండించిన పత్తి పంటలో 30 శాతమే కొనుగోలు చేయాలి. మిగిలిన పంట డిసెంబర్, జనవరిలో కొనుగోలు చేసే విధంగా నిబంధన కొనసాగుతోంది. ఈ నిబంధనను ప్రభుత్వం ప్రస్తుతం మార్పు చేసింది. తద్వారా 75 శాతం పంటను ఇప్పుడు రైతులు కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవచ్చు. 

వేరుశనగ రైతులకు ఊరట
► వర్షాల కారణంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పంట లేకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆ పంటను అమ్ముకోలేకపోతున్నారు. దీంతో వ్యాపారులు సగానికి సగం ధరను తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల రీత్యా వేరుశనగ పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 
► కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేరుశనగ పంటలో గింజ 65 శాతానికిపైగా ఉంటేనే క్వింటా రూ.5,275కు కొనుగోలు చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. అయితే వర్షాల కారణంగా 60 శాతం గింజ (అవుటెన్‌) ఉంటే సరిపోతుందని, ఆ విధంగా ఉన్న వేరుశనగకు క్వింటాకు రూ.4,500 ధర ప్రకటించింది. మార్కెట్‌లో వ్యాపారులు 60 శాతం గింజ ఉన్న వేరుశనగను రూ.3,500కే కొనుగోలు చేస్తున్నందున ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఊరట కలిగిస్తోంది. 
► డ్యామేజీ 2 నుంచి 3%, దెబ్బతిన్న గింజలు 2 నుంచి 6%, గింజ ముడత, పక్వానికిరాని కాయలు 4 నుంచి 8%నికి పెంచింది. నిబంధనలు సడలించడం వల్ల ప్రభుత్వంపై రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు భారం పడనుంది. ఈ నిబంధనలు తక్షణం అమలు పరచాలని కొనుగోలు కేంద్రాల్లోని సిబ్బంది, అధికారులను ఆదేశించామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న తెలిపారు. 

వరదలతో భారీగా పంట నష్టం
భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో వేరుశనగ, పత్తి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాయలసీమ జిల్లాల్లో 7.46 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగైంది. సగటున ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉంటే ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా 4 క్వింటాళ్లకు మించి రాలేదు. నాణ్యత లేనందున క్వింటా రూ.4 వేలకు మించి అమ్ముకోలేకపోతున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ద్వారా 1.83 లక్షల టన్నుల వేరుశనగ కొనుగోలు చేయనున్నారు. రాష్ట్రంలో 6 లక్షల హెక్టార్ల వరకు రైతులు పత్తి సాగు చేశారు. 8 శాతం లోపు తేమ ఉన్న పత్తికి క్వింటాకు రూ.5,825 చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది. అయితే వర్షాల కారణంగా తేమ శాతం 12 శాతానికిపైనే ఉంటోంది. దీంతో క్వింటా రూ.3,500తో మాత్రమే ప్రైవేట్‌ వ్యాపారులు కొంటున్నారు. ఈ దృష్ట్యా పంటను ఎండబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)