వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఏపీ: రెండు రోజులు వర్షాలే..
Published on Thu, 07/15/2021 - 08:34
సాక్షి, విశాఖపట్నం: ఛత్తీస్గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. ఇది క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీనివల్ల గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. దీని ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా, కోస్తాంధ్రలో అడపాదడపాగా వానలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది. సముద్రంలో తూర్పు, పశ్చిమ గాలుల కలయికతో ఏర్పడిన షియర్ జోన్ సముద్ర మట్టం నుంచి 3.1 నుంచి 5.8 కి.మీ. మధ్య విస్తరించి ఉంది. వీటన్నింటి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న రెండు రోజుల (గురు, శుక్రవారాలు) పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Tags