అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తప్పని డోలీ మోత.. దుప్పట్లు అడ్డంగా పెట్టి రోడ్డుపైనే ప్రసవం
Published on Sat, 12/11/2021 - 13:03
సాక్షి, చింతపల్లి: తరతరాల నిర్లక్ష్యం ఇప్పటికీ మన్యవాసులకు శాపంగా మిగిలింది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు పంచాయతీ తాటిబందకు చెందిన నిండు గర్భిణి కొర్రా చిన్నిని డోలీలో ఆస్పత్రికి తరలిస్తుండగా శుక్రవారం మార్గంమధ్యలో ప్రసవించింది. పురిటినొప్పులతో బాధపడుతున్న చిన్నిని డోలిలో డౌనూరు ఆస్పత్రికి సమీపంలో ఉన్న రాసపనుకు తీసుకువెళ్లి అక్కడ నుంచి 108 వాహనంలో డౌనూరు తరలించే ప్రయత్నం చేశారు.
దారిలో పురిటినొప్పులు అధికం కావడంతో రహదారి మధ్యలోనే దుప్పట్లు అడ్డంగా పెట్టి ఆమె వెంట వచ్చిన మహిళలు ప్రసవం జరిపారు. మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లీ బిడ్డలిద్దరినీ డౌనూరు ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు కల్పించారు.
#
Tags