amp pages | Sakshi

నిర్మించి లీజుకిస్తేనే లాభం! 

Published on Mon, 12/07/2020 - 04:27

సాక్షి, అమరావతి: ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీపీ)తో పోర్టుల నిర్మాణం ద్వారా భారీగా ఆదాయాన్ని నష్టపోతుండటంతో సొంతంగా నిర్మించి లీజుకివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా అధికాదాయాన్ని ఆర్జించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను ల్యాండ్‌ లార్డ్‌ (నిర్మించి లీజుకివ్వడం) విధానంలో ఏపీ మారిటైమ్‌ బోర్డు నిర్మిస్తోంది. గడిచిన ఆరేళ్లలో రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రయివేటు పోర్టులు కాకినాడ డీప్‌వాటర్, గంగవరం, కృష్ణపట్నం రూ.18,062.32 కోట్ల విలువైన ఆదాయాన్ని ఆర్జిస్తే.. అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఖజానాకు వచ్చింది కేవలం రూ.978.58 కోట్లు మాత్రమే. అంటే వేలాది ఎకరాలిచ్చి, మౌలిక వసతులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఐదు శాతం ఆదాయమే లభిస్తోంది. తక్కువ వ్యాపారం చేసిన కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు ద్వారా రాష్ట్ర ఖజానాకు అధికాదాయం వస్తే, ఎక్కువ లావాదేవీలు నిర్వహిస్తున్న గంగవరం, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఆదాయం తక్కువగా ఉంటోంది.  

డీప్‌వాటర్‌ పోర్టుదే అగ్రస్థానం 
2014–15 నుంచి 2019–20 ఆరేళ్ల కాలంలో ఈ మూడు పోర్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు సమకూరిన 978.58 కోట్లలో రూ.599.94 కోట్లు ఒక్క కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు నుంచే వచ్చింది. మిగిలిన రెండు పోర్టుల నుంచి వచ్చింది రూ.378.64 కోట్లే. దీనికి కారణం కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టును ప్రభుత్వం నిర్మించి ఆ తర్వాత ప్రయివేటు సంస్థకు అప్పజెప్పింది. దీనివల్ల ఈ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 22 శాతం ఉంది. అదే పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో ప్రభుత్వ వాటా వరుసగా 2.1, 2.6 శాతంగా ఉంది. దీనివల్ల ఈ రెండు పోర్టులు అధిక వ్యాపారం చేస్తున్నా రాష్ట్ర ఖజానాకు వస్తోంది మాత్రం చాలా స్వల్పం.

ఈ ఆరేళ్లలో ఈ మూడు పోర్టులు 497.206 మిలియన్‌ టన్నుల సరకు రవాణా చేయడం ద్వారా రూ.18,062.32 కోట్ల ఆదాయాన్నార్జించాయి. ఇందు లో కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు కేవలం 88.74 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేస్తే, గంగవరం పోర్టు 148.804, కృష్ణపట్నం పోర్టు 259.662 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసింది. సరుకు రవాణా ద్వారా డీప్‌వాటర్‌ పోర్టుకు రూ.2,687.93 కోట్లు, గంగవరం పోర్టు రూ.4,921.45 కోట్లు, కృష్ణపట్నం పోర్టు రూ.10,452.94 కోట్లు ఆర్జించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నాటికి ఈ మూడు పోర్టులు 77.745 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.1,899.92 కోట్ల ఆదాయాన్ని పొందాయి. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఈ ఏడాది రూ.108.29 కోట్ల ఆదాయం సమకూరింది.  

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌