కొనసాగుతున్న 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' పంపిణీ

Published on Sun, 08/01/2021 - 03:38

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' పంపిణీ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నుంచే వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా 60,50,377 మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం రూ.1455.87 కోట్లు కేటాయించింది. 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది.

వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నారు. ఇంటి వద్దకే పెన్షన్‌ చేరుతుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 77.03 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు పింఛన్ల పంపిణీ జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ