ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
మొహర్రం రోజు పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు ఇవే!
Published on Thu, 08/13/2020 - 08:55
సాక్షి, అమరావతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన కోవిడ్–19 నిబంధనలు మొహర్రం పండుగలో భక్తులు తప్పకుండా పాటించాలని మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి మహమ్మద్ ఇలియాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 20 నుంచి పది రోజులు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు.
పండుగ రోజు పాటించాల్సిన కోవిడ్ నియమాలు:
- పీర్ల చావిడి వద్ద ముజావర్లు, ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీ సభ్యులు కలిసి 10 మందికి మించకుండా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. ప్రజలకు, భక్తులకు తమ ఇళ్లలోనే పాతియా (భోజనం) అందించాలి.
- పీర్ల చావిడి వద్ద శానిటైజర్లు ఉంచాలి. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న పెద్దలు, పిల్లలు పీర్ల చావిడి వద్దకు రాకుండా చూడాలి.
- మొహర్రం (షాహదత్) చివరి 9, 10వ రోజుల్లో పది మందికి మించకుండా ఊరేగింపు చేసుకోవచ్చు.
- పీర్లచావిడి వద్ద జంతు బలి, ఆర్కెస్ట్రా సంగీత బృందాలు నిషేధం. æ పై కార్యక్రమాల అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, విభాగాధిపతులను ప్రభుత్వం ఆదేశించింది.
చదవండి: కరోనా కాదంటూ రోదించినా...
#
Tags