amp pages | Sakshi

‘బాబు దుర్మార్గం.. టీడీపీ నేతలే నిజాలు కక్కారు’

Published on Sun, 03/07/2021 - 14:08

సాక్షి, తాడేపల్లి: ప్రశాంతంగా ఉన్న విజయవాడలో ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి పట్టిన చీడపురుగుగా ఆయన చంద్రబాబును అభివర్ణించారు. దొంగల ముఠా అంతా ఏకమై ఇప్పుడు నీతిసూత్రాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు దుర్మార్గం గురించి ఆ పార్టీ నేతలే నిజాలు కక్కారని.. బోండా ఉమ, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా ఆరోపణలకు సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఉపయోగం లేదని.. ప్రాంతానికో మాట మాట్లాడుతున్న ఆయనను ప్రజలు నమ్మరన్నారు.

‘‘దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మించలేకపోయిన అసమర్థుడు చంద్రబాబు. అధికారంలో ఉండగా పన్నులు పెంచి.. ఇప్పడు తగ్గిస్తానంటే ప్రజలు నమ్మరు. ఒక ఎంపీని కంట్రోల్ చేయలేని చంద్రబాబు ఒక నాయకుడా?. ఏపీలో టీడీపీ జమానా ముగిసింది. పగటికలలతో సరిపెట్టుకోక తప్పదు. ఫ్యాన్ హవా ముందు పంచర్ అయిన సైకిల్ నిలువలేదని’’ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శలు గుప్పించారు.

జగన్‌ పాలనలో సంక్షేమం: ఎమ్మెల్యే మేరుగ
విశాఖ: చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు చూశామని.. వైఎస్‌ జగన్‌ పాలనలో సంక్షేమ పథకాలు చూస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. కులం, మతం, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సీఎం అమలు చేస్తున్నారన్నారు. విశాఖ ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం లేఖ రాశారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 82 శాతం ప్రజలు సీఎం జగన్‌కు పట్టం కట్టారని.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే రిపీట్ అవుతుందని మేరుగ నాగార్జున ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పచ్చని పంట పొలాలను నాశనం చేశారు: పండుల రవీంద్రబాబు
విశాఖకు పరిపాలన రాజధాని కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని రవీంద్రబాబు అన్నారు. చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. పచ్చని పంట పొలాలను చంద్రబాబు నాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు.


చదవండి:
'రాసలీలలు చేసే లోకేష్‌కు విమర్శించే హక్కు లేదు' 
ఇక టీడీపీ చాప్టర్‌ క్లోజ్‌: విజయసాయిరెడ్డి

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌