‘చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే మా ప్రభుత్వం నిర్మిస్తోంది’

Published on Wed, 11/03/2021 - 15:07

అమరావతి: దేవాలయశాఖలో వినూత్న మార్పులు తెస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాలయాల భూములు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల అభివృద్ధికి సీఎం జగన్‌ నిధులు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్‌ కేసుల పరిష్కారానికి న్యాయవాదులను నియమిస్తున్నట్లు తెలిపారు.

దేవాలయాల అభివృద్ధికి కూడా నాడు-నేడు విధానం రూపొందించామని మంత్రి వెల్లంపల్లి అన్నారు. అదే విధంగా ప్రతి దేవాలయంలోను గోశాలలను ఏర్పాటుచేస్తామని మంత్రి వెల్లంపల్లి స్పష్టం చేశారు. చంద్రబాబు దేవాలయాలను కూలిస్తే.. మా ప్రభుత్వం నిర్మిస్తోందని పేర్కొన్నారు. త్వరలోనే 9 కొత్త దేవాలయాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రసాదం స్కీం ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేస్తున్నామని వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ