amp pages | Sakshi

ఐదింటిపై పట్టు

Published on Thu, 02/17/2022 - 03:12

సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయి ఎనిమిదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించి పలు సమస్యలు పరిష్కారం కాలేదు. కేంద్ర ప్రభుత్వం అడపాదడపా ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వహించడం మినహా పరిష్కార మార్గాలను సూచించలేదు. తాజాగా కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్‌ కుమార్‌  నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్ధిక శాఖ ప్రత్యేక సీఎస్‌లు ఎస్‌ఎస్‌ రావత్, రామకృష్ణారావులతో ఏర్పాటైన ఉప కమిటీ గురువారం ఉదయం 11 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం కానుంది. ఇరు రాష్ట్రాల అధికారులతో పాటు ఏపీ పునర్విభజన విభాగం ముఖ్యకార్యదర్శి ఎల్‌.ప్రేమచంద్రారెడ్డి దీనికి హాజరు కానున్నారు. విభజనకు సంబంధించి ఐదు పెండింగ్‌ అంశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు.

గాజుల రామారంలో 270 ఎకరాలు..
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీఎస్‌ఎఫ్‌సీ) ఆస్తుల విభజనపై తొలుత అంగీకరించిన తెలంగాణ సర్కారు ఆ తరువాత మాట మార్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఎఫ్‌సీకి 2005–06లో ప్రభుత్వ ఈక్విటీ కింద డబ్బులకు బదులుగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా గాజుల రామారంలో ఎకరం రూ.40 లక్షల చొప్పున 270 ఎకరాలను కేటాయించింది. విభజన చట్టం ప్రకారం ఈక్విటీ జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు చెందాలి. తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఈ భూమిలో ఏపీకి వాటా ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉప కమిటీ సమావేశంలో ప్రస్తావించనుంది.

కరెంట్‌ బకాయిలు ఏవి?
రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఏపీ జెన్‌కో విద్యుత్‌ సరఫరా చేసింది. 2014 జూన్‌ 2 నుంచి 2017 జూన్‌ 10 వరకు 8,890 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందచేసింది. దీనికి సంబంధించి ఏపీకి రూ.6,284 కోట్లను  తెలంగాణ చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ డిస్కంలు కూడా అంగీకరించినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. బకాయిలు వసూలు కాకపోవడంతో ఏపీ విద్యుత్‌ సంస్థలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌ విద్యుత్తు బిల్లులను తెలంగాణ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఉప కమిటీ సమావేశంలో కోరనుంది.

హైదరాబాద్‌లో పన్నుల చెల్లింపులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏపీకి చెందిన పలు కంపెనీలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాయి. పన్నులు కూడా హైదరాబాద్‌లోనే చెల్లించాయి. ఆ విధంగా ఏపీకి చెందిన సంస్థలు చెల్లించిన పన్నులు రూ.3,800 కోట్లు వరకు ఉంటాయి. ఈ మొత్తాన్ని ఇప్పించాలని ఏపీ ప్రభుత్వం కోరనుంది.

మా వాటా మాటేమిటి?
కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి విడుదలైన నిధుల్లో తమ వాటా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. ఆ నిధులను ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. అయితే తెలంగాణ నిధులు తమకు ఎలా వస్తాయని 
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది.

ఏపీ నిధులతో ధాన్యం సేకరణ
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పౌర సరఫరాల సంస్థలకు ఒకే అధికారి పని చేశారు. ఈ సమయంలో తెలంగాణలో ధాన్యం సేకరణ కోసం ఏపీకి చెందిన రూ.400 కోట్లను వినియోగించారు. ఆ మొత్తాన్ని తెలంగాణ నుంచి ఇప్పించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. అదే సమయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.600 కోట్ల సబ్సిడీ కూడా ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అశిష్‌ కుమార్‌ దృష్టికి తేనుంది.

అజెండాలో ఐదు ప్రధానాంశాలు
1. ఏపీ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ విభజన
2. ఏపీజెన్‌కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన విద్యుత్‌బకాయిలు
3. పన్ను అంశాలపై తలెత్తిన లోపాల పరిష్కారం
4. బ్యాంకులో ఉన్న నగదు, డిపాజిట్ల పంపిణీ
5. ఏపీఎస్‌సీఎస్‌సీఎల్, టీఎస్‌సీఎస్‌సీఎల్‌ మధ్య నగదు అంశం   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)