amp pages | Sakshi

‘మిగులు’ మళ్లింపుపై మీ వైఖరేంటి?

Published on Tue, 08/25/2020 - 05:50

సాక్షి, అమరావతి: కృష్ణా బేసిన్‌(పరీవాహక ప్రాంతం)లో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకే నీటిని మళ్లిస్తున్నామని, వాటిని లెక్కలోకి తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై వైఖరి వెల్లడించాలని తెలంగాణను కృష్ణా బోర్డు కోరింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌కు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఎల్బీమౌన్‌తంగ్‌ సోమవారం లేఖ రాశారు.  

► జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజీలు నిండినందున లక్షలాది క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నామని, ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందన్న అంచనాల నేపథ్యంలో విజయవాడ, పరిసర ప్రాంతాలను ముంపు బారిన పడకుండా కాపాడేందుకు నీటిని మళ్లిస్తున్నామని, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈనెల 22న కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇలా మళ్లిస్తున్న నీటిని మిగులు జలాలుగా పరిగణించి విభజన చట్టం 11వ షెడ్యూలులోని ఆరు పేరా నుంచి వాటిని మినహాయించాలని కోరారు.  

సముద్రంలో వృథాగా కలిసే మిగులు జలాలనే మళ్లిస్తున్నందున వాటిని ఆ ప్రకారమే పరిగణించి లెక్కలోకి తీసుకోవద్దని  కోరారు.  వరదల సమయంలో ఏ రాష్ట్రం నీటిని మళ్లించినా వాటిని ఆ రాష్ట్రం కోటా కింద పరిగణించకూడదని విజ్ఞప్తి చేశారు. 

శ్రీశైలం ప్రమాదంపై నివేదిక ఇవ్వండి 
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో జరిగిన దుర్ఘటనపై కృష్ణా బోర్డు విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాల్సినందున త్వరగా నివేదిక పంపించాలని సూచించింది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌