amp pages | Sakshi

వాటాలో వినియోగించుకోని నీటిపై తేల్చండి

Published on Sat, 08/15/2020 - 06:30

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో గతేడాది వాటా నీటిలో వినియోగించుకోకుండా మిగిలిన వాటిని తర్వాతి సంవత్సరం ఉపయోగించుకోవచ్చా? లేదా? అనే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కృష్ణా బోర్డు కోరింది. గతేడాది వినియోగించుకోని వాటా నీటిని ఈ ఏడాది విడుదల చేయాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఏ నీటి సంవత్సరం నీటి లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని.. వినియోగించుకోని నీటిని క్యారీ ఓవర్‌గానే పరిగణించాలని తేల్చిచెప్పింది. ఈ నీటి వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఈ అంశాన్ని కేంద్ర జలసంఘానికి పంపించి, వీలైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని విజ్ఞప్తి చేస్తూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా శుక్రవారం కేంద్ర జల్‌శక్తి శాఖకు లేఖ రాశారు. లేఖలో ప్రధానాంశాలు ఇవీ..

► 2019–20 నీటి ఏడాదిలో ఏపీ 651.99 టీఎంసీలకు గానూ 647.43 టీఎంసీలు వినియోగించుకుంది. తెలంగాణ 333.52 టీఎంసీల వాటాకు278.33 టీఎంసీలు ఉపయోగించుకుంది.
► గత నీటి సంవత్సరంలో వాటాలో 50 టీఎంసీలకు పైగా నీటిని వినియోగించుకోలేదని, ఆ నీటిని 2020–21లో ఉపయోగించుకుంటామని తెలంగాణ ప్రతిపాదించింది. 
► కానీ, దానిని ఏపీ తోసిపుచ్చింది. ఏ నీటి సంవత్సరం లెక్కలు అక్కడితోనే ముగుస్తాయని.. వాటిని క్యారీ ఓవర్‌గా పరిగణించాలని స్పష్టంచేసింది.
► దీంతో ఈ వివాదంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ దృష్టికి తీసుకువచ్చాం. ఈ కమిటీ భేటీలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ అంశంపై విధివిధానాలు ఖరారుచేసే బాధ్యతను కేంద్ర జలసంఘానికి అప్పగించి వీలైనంత తొందరగా తేల్చాలి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌