అల్లూరిని స్మరించుకోవడం అదృష్టం

Published on Sun, 05/08/2022 - 04:34

సీతమ్మధార (విశాఖ ఉత్తర): అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్టమని, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అలాగే అల్లూరితో కలసి బ్రిటీష్‌ వారితో పోరాటం చేసిన కుటుంబాలను గుర్తించి.. వారి వారసుల పిల్లలకు ప్రైవేట్‌ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.

లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియంను ఏడాదిలోపు ఏర్పాటు చేస్తామన్నారు. సీతమ్మధార క్షత్రియ కల్యాణమండపంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం మాట్లాడుతూ అల్లూరి 125వ జయంత్యుత్సవాలను ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు దేశ వ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలకు గుర్తుండేలా స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. సీఎం జగన్‌ రాష్ట్రంలోని ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవమన్నారు.

అల్లూరి తిరిగిన ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్, నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వరుదు కల్యాణి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు.

రావాల్సిన నిధులివ్వండి : మంత్రి రోజా
మహారాణిపేట: రాష్ట్రంలో పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని మంత్రి ఆర్‌కే రోజా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. శనివారం పోర్టు గెస్టు హౌస్‌లో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రోజా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిలిగ్రిమ్స్, హెరిటేజ్‌ డెస్టినేషన్‌ మ్యూజియం గ్రాంట్స్‌ మంజూరు చేయాలని కోరుతూ.. డీపీఆర్‌లను కేంద్ర మంత్రికి అందజేశారు.  

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)