amp pages | Sakshi

సజావుగా ధాన్యం సేకరణ

Published on Mon, 11/21/2022 - 05:35

సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.   ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు.  

ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే క్రిమినల్‌ చర్యలు 
ఈ క్రాప్‌ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని మంత్రి కారుమూరి సూచించారు. రైస్‌ మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే మిల్లర్లపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్‌ లిస్టులో పెడతామన్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్‌ చేయాలని ఆదేశించారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలన్నారు. గత ముఖ్యమంత్రుల కన్నా సీఎం జగన్‌ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌