amp pages | Sakshi

థీమ్‌ పార్కులు.. టూరిజం క్లస్టర్లు

Published on Sun, 12/20/2020 - 04:09

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రజల ఉపాధికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ఆ దిశగా కార్యాచరణ చేపట్టేందుకు కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ఏపీ టూరిజం పాలసీ 2020–25ని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖలోని సర్క్యూట్‌ హౌస్‌లో శనివారం ఆవిష్కరించారు. అనేక ప్రోత్సాహకాలు, రాయితీలతో పాటు కరోనా కారణంగా దెబ్బతిన్న పర్యాటక ఆధారిత యూనిట్లకు ఊపిరి పోసేందుకు రీ స్టార్ట్‌ ప్యాకేజీతో ప్రభుత్వం ఆదుకోనుంది. పర్యాటక ప్రాంతాల్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రాన్ని నాలుగు క్లస్టర్లుగా విభజించారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, రాజమండ్రి కేంద్రంగా ఉభయ గోదావరి, విజయవాడ–గుంటూరు కేంద్రంగా కోస్తా, తిరుపతి కేంద్రంగా రాయలసీమ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. రెండు నెలల్లో అన్ని క్లస్టర్లలో పెట్టుబడిదారులతో సదస్సులు (ఇన్వెస్టర్స్‌ మీట్స్‌) నిర్వహించనున్నారు.

ఎన్నో రాయితీలు.. మరెన్నో ప్రోత్సాహకాలు
కొత్త టూరిజం ప్రాజెక్టుల్ని ఏర్పాటు చేసే సంస్థలకు అందించే స్థలం విలువపై వసూలు చేసే 2 శాతం అద్దెకు బదులు 1 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. రూ.కోటి పెట్టుబడి, ఏడాది ఆదాయం రూ.5 కోట్ల కంటే తక్కువ ఉన్న ప్రాజెక్టుల్ని మైక్రో ప్రాజెక్టులుగా, రూ.10 కోట్లలోపు పెట్టుబడి, రూ.50 కోట్లలోపు ఆదాయం ఉంటే స్మాల్‌ ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లలోపు పెట్టుబడి, రూ.250 కోట్లలోపు ఆదాయం ఉంటే మీడియం ప్రాజెక్టులుగా, రూ.75 కోట్లకు పైగా పెట్టుబడి, రూ.400 కోట్ల వరకూ ఆదాయం ఉంటే లార్జ్‌ ప్రాజెక్టులుగా, రూ.400 కోట్లు పైబడి పెట్టుబడి ఉంటే మెగా ప్రాజెక్టులుగా పరిగణిస్తారు.

ల్యాండ్‌ యూజ్‌ కన్వర్జెన్స్‌ చార్జీల్ని నూరు శాతం మాఫీ చేయనున్నారు. టూరిజం యూనిట్స్‌ కోసం స్థలాల్ని కొనుగోలు చేసినా, భూములు, షెడ్స్, బిల్డింగ్స్‌ మొదలైనవి లీజుకు తీసుకున్నా స్టాంప్‌ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్‌ డ్యూటీని 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ చేస్తారు. కొత్తగా వచ్చే టూరిజం ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు 100 శాతం స్టేట్‌ జీఎస్‌టీ (ఎస్‌జీఎస్‌టీ) నుంచి మినహాయింపును రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చేస్తారు. కొత్తగా ప్రాజెక్టులకు ఐదేళ్లపాటు యూనిట్‌ విద్యుత్‌ను రూ.2 కే అందిస్తారు. మైక్రో, స్మాల్, మీడియం, లార్జ్‌ టూరిజం ప్రాజెక్టుల్లో హోటల్స్‌ కోసం 5 ఎకరాల వరకూ.. రిసార్టుల కోసం 10 ఎకరాల వరకూ.. ఎంఐసీఈ సెంటర్లకు 10 ఎకరాల వరకూ.. వే సైడ్‌ ఎమినిటీస్‌ కోసం 3 ఎకరాల వరకూ స్థలం కేటాయిస్తారు. 5 స్టార్, 7 స్టార్‌ హోటల్స్‌తో పాటు మెగా టూరిజం ప్రాజెక్టులు నిర్మించేందుకు ముందుకొస్తే అందుకు అవసరమైన స్థలాల్ని సమకూరుస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా థీమ్‌ పార్కులు
నూతన విధానం కింద రాష్ట్రవ్యాప్తంగా థీమ్‌ పార్కులు, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు ఏర్పాటవుతాయి. çహోటల్స్, రిసార్టులు, వాటర్‌ విల్లాస్, హెరిటేజ్‌ హోటల్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, థీమ్‌ పార్కులు, ఎంఈసీఈ సెంటర్లు, గోల్ఫ్‌ కోర్సులు, బొటానికల్‌ గార్డెన్లు, అర్బన్, రూరల్‌ హట్స్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్, వే సైడ్‌ ఎమినిటీస్, స్పిరిచ్యువల్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, మ్యూజియమ్స్, ఫార్మ్‌ స్టేలు, అగ్రి టూరిజం.. ఇలా విభిన్న ప్రాజెక్టులతో ఆయా సంస్థలు ముందుకొచ్చేలా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించింది. బుద్ధిస్ట్‌ టూరిజం, ఎకో టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం, రూరల్‌ టూరిజం, హెరిటేజ్‌ టూరిజంగా విభజించి ప్రాజెక్టుల్ని ఆహ్వానించనున్నారు. టూరిజం పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

పర్యాటకానికి పునరుజ్జీవం
గత ప్రభుత్వం అమలు చేసిన టూరిజం పాలసీ.. పర్యాటక వర్గాలకు చేదు అనుభవాన్నిచ్చింది. అందుకే ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్‌ కూడా రాలేదు. సీఎం జగన్‌ సూచనల మేరకు కొత్త పాలసీని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాం. వివిధ రాష్ట్రాల నుంచి పెట్టుబడుల్ని ఆహ్వానించేందుకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో ప్రచారాలు, వివిధ సంస్థలతో భేటీలు నిర్వహిస్తాం. కేవలం ఆదాయంపైనే కాకుండా.. పర్యాటక ప్రాంతాలకు వచ్చే ప్రజలు సురక్షితంగా వాటిని సందర్శించేలా పక్కా నిబంధనలు అమలు చేస్తాం.   
 – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)