‘కడప స్టీల్‌ ప్లాంట్‌’కు భారీ స్పందన

Published on Thu, 08/06/2020 - 03:33

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కడప స్టీల్‌ ఉక్కు కర్మాగారం (ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌–ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌)లో భాగస్వామ్యం కావడానికి దేశీయ, అంతర్జాతీయ ఉక్కు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ ప్రాజెక్టులో చేరడానికి ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) కోరుతూ పిలిచిన టెండర్లలో అయిదు దేశీయ, రెండు అంతర్జాతీయ అతిపెద్ద ఉక్కు తయారీ కంపెనీలు ఆసక్తిని వ్యక్తం చేసినట్లు ఏపీహెచ్‌ఎస్‌ఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.షాన్‌ మోహన్‌ ‘సాక్షి’కి తెలిపారు.

► జూలై 31తో ముగిసిన టెండర్లకు ఈ స్థాయిలో స్పందన రావడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
► పలు ఆర్థిక ప్రతిపాదనలతో రావాల్సిందిగా రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ (ఆర్‌ఎఫ్‌పీ) టెండర్లను త్వరలో జారీ చేయనున్నారు.
► ట్రాన్సాక్షన్‌ అడ్వైజరీగా వ్యవహరిస్తున్న ఎస్‌బీఐ క్యాప్‌ ఈ టెండర్ల ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
► ఈ ప్రతిపాదనల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం ఇవ్వడానికి ముందుకు వచ్చిన కంపెనీని భాగస్వామిగా ఎంపిక చేస్తారు.
► ఏడాదికి 3 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో  వైఎస్సార్‌ కడప జిల్లా సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,591.65 ఎకరాల్లో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గతేడాది డిసెంబర్‌ 23న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. 
► ఇప్పటికే సివిల్‌ పనులు శరవేగంగా జరుగుతుండగా, వచ్చే జనవరి నుంచి ప్రధాన ప్లాంటు పనులు ప్రారంభమయ్యే విధంగాఏపీహెచ్‌ఎస్‌ఎల్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ