రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
గడప గడపనా ఆదరణ
Published on Thu, 05/19/2022 - 04:42
సాక్షి నెట్వర్క్: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. బుధవారం ఎనిమిదవ రోజు అన్ని జిల్లాల్లో కార్యక్రమం కొనసాగింది. మూడేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, ప్రజలకు కలిగిన లబ్ధిని వివరిస్తూ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ముందుకు సాగారు.
తమకు ఏమేరకు లబ్ధి కలిగిందో ప్రజలు సైతం ఉత్సాహంగా వివరించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో ఈ కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఉమ్మడి కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమై పలు సమస్యలను పరిష్కరించారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
#
Tags