amp pages | Sakshi

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రండి

Published on Fri, 02/10/2023 - 05:55

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీ­ల్లో నిర్వహించనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు రావాలని పలువురు కేంద్ర మంత్రులను ఏపీ మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆహ్వానించారు.గురువారం ఢిల్లీ­లో కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, కిషన్‌రెడ్డి, మన్సుఖ్‌ మాండవీయా, సర్బా­నంద సోనోవాల్‌లను  రాష్ట్ర మం­­త్రు­లిద్దరూ కలిశారు.

అనంతరం గుడివాడ అమర్‌­నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రపంచ పెట్టుబడిదారుల సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో 49 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించిన 13 రంగాలకు ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు.

రాష్ట్ర పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి ఉపకరించడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లలో 49 వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. ఇవన్నీ పారిశ్రామిక ప్రగతికి ఉపకరిస్తాయని వెల్ల­డించారు. విశాఖ సదస్సుకు దేశంలోని పారిశ్రామికవేత్తలతో సహా అంతర్జాతీ­య సంస్థల ప్రతినిధులు కూడా వస్తారని చెప్పారు.

గత ప్రభుత్వం సదస్సుల ద్వారా రూ.18 లక్షల కోట్ల ప్రాజెక్టులతోపాటు 30 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొందని.. అయితే రూ.1.87 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. విశాఖ రాజధాని అని సీఎం పేర్కొనడాన్ని ప్రభుత్వ విధానాల గురించి చెప్పడంలో భాగంగానే చూడాలన్నారు.

కొత్త ప్రకటనలా చూడాల్సిన అవసరం లేదని గుడివాడ అమర్‌నాథ్‌ అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో కేంద్రం రాజధానిపై వేసిన అఫిడవిట్‌ను చంద్రబాబు చదివినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.  

Videos

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌