amp pages | Sakshi

కృష్ణా జల వివాదాలకు ముగింపు!

Published on Tue, 05/17/2022 - 05:07

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో విద్యుదుత్పత్తిని నియంత్రణ, నిర్వహణ నియమావళి ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తే జల వివాదాలకు తావే ఉండదని కృష్ణా బోర్డు భావిస్తోంది.

మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్‌లై కన్వీనర్‌గా, ఎల్బీ ముయన్‌తంగ్, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు, జెన్‌కోల సీఈలు సభ్యులుగా రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఆర్‌ఎంసీ)ని నియమించింది. ఈ కమిటీ ఈనెల 20న హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సమావేశమవుతోంది.

బచావత్‌ ట్రిబ్యునలే ప్రామాణికంగా
బచావత్‌ ట్రిబ్యునల్‌ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. వాటిని ప్రామాణికంగా తీసుకున్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలో  విధి విధానాల ముసాయిదా (రూల్‌ కర్వ్‌ డ్రాఫ్ట్‌)ను రూపొందించింది. దీనిపై అధ్యయనం చేసి మార్పులు ఉంటే చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని బోర్డు ఆదేశించింది. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చింది.

ఈ నేపథ్యంలో కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి జలాలు కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశంపైన కూడా అధ్యయనం చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్‌ఎంసీని ఆదేశించింది. ఆర్‌ఎంసీ నివేదికను బోర్డులో చర్చించి.. అమలు చేయడం ద్వారా జల వివాదాలకు చరమగీతం పాడాలని నిర్ణయించింది. 

విద్యుదుత్పత్తి నియంత్రణే కీలకం
గతేడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్‌ స్టోరేజీ స్థాయిలో ఉన్నా, ఎగువ నుంచి వరద రాకున్నా.. బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా  తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. విద్యుదుత్పత్తి చేయొద్దని బోర్డు జారీ చేసిన ఆదేశాలనూ తుంగలో తొక్కింది. ఇష్టారాజ్యంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ ద్వారా వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీనిపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.

తెలంగాణ తీరుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. 2022–23 నీటి సంవత్సరంలో కూడా ఈ పరిస్థితి పునరావృతం కాకుండా బోర్డు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో విద్యుదుత్పత్తికి 15 రోజుల్లోగా నియమావళిని రూపొందించాలని ఆర్‌ఎంసీని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ఆదేశించారు. 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)