amp pages | Sakshi

గత ప్రభుత్వ జీవోల ప్రకారమే స్థలాల వేలం

Published on Mon, 06/27/2022 - 07:46

సాక్షి, అమరావతి: రాజధాని భూముల అమ్మకంపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని, గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన విజయవాడ, గుంటూరు, తెనాలి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ మునిసిపాలిటీల్లో ఖాళీగా ఉన్న స్థలాలను చట్టబద్ధంగా అమ్మకానికి ఉంచామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదివారం తెలిపారు. ఇవే స్థలాలను గత ప్రభుత్వం 2017లో అమ్మకానికి పెట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ స్థలాలను రాజధాని అభివృద్ధి కోసం ఈ–వేలం వేస్తున్నట్టు చెప్పారు. భూములను ఆదాయ వనరుగా చూడాలని గత ప్రభుత్వమే ప్రకటించిందని.. అమ్మడం, కొనడం అందులో భాగమేనన్నారు.

2017 జూన్‌ 15న అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో–228 ప్రకారమే ఆ స్థలాలకు ఈ–వేలం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి ప్రభుత్వం 500 ఎకరాల రాజధాని భూములు అమ్మకానికి ఉంచినట్టు ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. జీవో 389, 390ల్లో పేర్కొన్న స్థలాలు వివిధ ప్రాంతాల్లో ఉన్నాయన్న విషయాన్ని ఆ పత్రిక గుర్తించాలని, ఇవేమీ రహస్య ఉత్తర్వులు కాదని, అంతా బహిరంగమేనన్నారు.

ఏ స్థలం ఎక్కడ ఉందో సదరు జీవోల్లో వివరంగా ఉన్నప్పటికీ ‘500 ఎకరాల రాజధాని భూముల అమ్మకం’ అంటూ తప్పుడు ప్రచారం చేయడం తీవ్రమైన చర్యగా మంత్రి సురేష్‌ పేర్కొన్నారు. దీంతోపాటు అమరావతి అభివృద్ధిలో భాగంగా వివిధ కంపెనీల స్థాపన కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం వందల ఎకరాలు కట్టబెట్టిందని, వాటిలో చాలా సంస్థలు గడువులోగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో ఆ భూములను తిరిగి ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. ఈ విధంగా 2016లో భూములు తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టని కారణంగా ఆయా సంస్థల ఒప్పందాన్ని 2019లోనే ప్రభుత్వం రద్దు చేసిందని, వాటిలో స్వల్ప స్థలాలను కూడా ఈ–వేలానికి ఉంచినట్టు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ఈనాడు పత్రిక తెగ ఆరాటపడుతోందని, ఈ విష ప్రచారం కూడా అందులో భాగమేనని విమర్శించారు.   

Videos

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Watch Live: బొబ్బిలిలో సీఎం జగన్ ప్రచార సభ

పవన్ కళ్యాణ్ కు ముద్రగడ సవాల్

సీఎం జగన్ ను చంపేందుకు కుట్ర..!

శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బండ బూతులు..

గుండె నిండా కేసీఆర్..

అట్టర్ ఫ్లాప్..

జనసేన పరువు తీసిన చింతమనేని

పవన్ కళ్యాణ్, చిరంజీవి కుట్ర బయటపెట్టిన కేఏ పాల్

వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారం

YSRCP ఎమ్మెల్యే అభ్యర్థి కావటి మనోహర్ నాయుడిపై దాడికి యత్నం

పులివెందులలో జోరుగా వైఎస్ భారతి ప్రచారం

సుజనా చౌదరికి కేశినేని శ్వేత కౌంటర్..

Photos

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)