చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
గన్నవరం చేరుకున్న సీఎం జగన్
Published on Tue, 10/06/2020 - 18:52
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ బయలు దేరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ మంగళవారం సమావేశమయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి కొనసాగింది. రాష్ట్ర అభివృద్ధి అజెండాగా ఈ సమావేశం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మోదీతో సమావేశం ముగిసిన అనంతరం వీడియో కాన్సరెన్స్ ద్వారా అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు అయ్యారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం జగన్ ఢిల్లీ నుంచి బయలు దేరి రాష్ట్రానికి చేరుకున్నారు.
చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ
Tags