వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సంచయితకు బాసటగా మహిళా కమిషన్
Published on Thu, 06/24/2021 - 05:02
సాక్షి,అమరావతి/నెహ్రూనగర్ (గుంటూరు): మాన్సాస్ ట్రస్టు, సింహాచలం దేవస్థానం బోర్డు నుంచి సంచయితను కోర్టు తప్పించడంపై టీడీపీ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని ఆమె కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
సంచయితకు మహిళా కమిషన్ బాసటగా నిలుస్తుందని పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం గడిచిన రెండేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధిని సీఎం కోరుకుంటే.. టీడీపీ నేతలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
#
Tags