amp pages | Sakshi

నరేంద్ర తదితరుల విచారణకు ఏసీబీకి హైకోర్టు అనుమతి

Published on Tue, 05/04/2021 - 05:17

సాక్షి అమరావతి: సంగం డెయిరీ అక్రమాలకు సంబంధించి టీడీపీ సీనియర్‌ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీ గోపాలకృష్ణన్, సహకారశాఖ మాజీ ఉద్యోగి గురునాథంలను ఏసీబీ అధికారులు ప్రశ్నించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. రేపటినుంచి నరేంద్రను 3 రోజులు, గోపాలకృష్ణన్‌ను రెండురోజులు, గురునాథంను ఒకరోజు విచారించవచ్చని ఏసీబీ అధికారులకు తెలిపింది. కోవిడ్‌ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని రాజమండ్రి కేంద్ర కారాగారంలోనే విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ధూళిపాళ్ల నరేంద్ర తదితరులను సంగం అక్రమాల కేసులో విచారించాల్సి ఉందని, అందువల్ల వారిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీబీ కోర్టు నరేంద్ర తదితరులను 5 రోజులపాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నరేంద్ర తదితరులు హైకోర్టులో శనివారం హౌస్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి.. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. సోమవారం విచారణ జరిపిన న్యాయమూర్తి.. ధూళిపాళ్ల తదితరుల విచారణకు ఏసీబీకి అనుమతి ఇచ్చారు.

జీవో 19పై ముగిసిన వాదనలు 
మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా
సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన జీవో 19ని సవాలు చేస్తూ సంగం మిల్క్‌ ప్రొడ్యూసర్స్‌ కంపెనీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ధర్మారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు నిన్న న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. చట్టప్రకారమే జీవో ఇచ్చామన్నారు. షరతులకు అనుగుణంగా నడుచుకోకుండా, నిబంధనలను ఉల్లంఘించినందునే సంగం డెయిరీ నిర్వహణ బాధ్యతలను పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తెచ్చినట్లు చెప్పారు. దీనివల్ల పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

నిబంధనలకు విరుద్దంగా 10 ఎకరాల భూమిని ఆస్పత్రి నిర్మాణం నిమిత్తం ట్రస్ట్‌కు బదిలీ చేశారని తెలిపారు. డెయిరీ విషయంలో ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయన్నారు. అన్నీ నిబంధనల ప్రకారమే చేశామని, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని చెప్పారు. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. సంగం డెయిరీని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. స్వాధీన ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.  

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)