amp pages | Sakshi

రైతులకు రూ.135.70కోట్ల పెట్టుబడి రాయితీ

Published on Tue, 10/27/2020 - 02:30

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుది అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్‌ఎఫ్‌) నిబంధనావళి ప్రకారం 33 శాతానికి మించి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిన రైతులకు  రూ.113,11,68,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.22,58,84,000 మేర పెట్టుబడి రాయితీని విడుదల చేసింది.  

ఆన్‌లైన్‌లో రైతుల ఖాతాలకు జమ 
జూన్, జూలైలో వర్షాల వల్ల ఉభయ గోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో 14,005 మంది రైతులకు చెందిన 8,443.75 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ కమిషనర్‌ ప్రతిపాదన మేరకు పెట్టుబడి రాయితీగా ప్రభుత్వం రూ.12.39 కోట్లు విడుదల చేసింది. ఆగస్టు, సెపె్టంబర్‌లో వరదలు, భారీ వర్షాలవల్ల 1,28,889 మంది రైతులకు చెందిన 73,664.73 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. వీరికి రూ.100.72 కోట్లు పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర సమాచారాన్ని పక్కాగా పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి ఖాతాలకు ఆన్‌లైన్‌లో జమ చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.  

ఉద్యాన రైతులకు రూ.22.58 కోట్లు...  
ప్రకాశం, ఉభయ గోదావరి, వైఎస్సార్, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు  ప్రభుత్వం రూ. 22.58 కోట్ల పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం వేర్వేరు జీవోలు 
జారీ చేశారు.

సాయంలో శరవేగం.. 
రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విపత్తు వల్ల పంట నష్టపోయిన రైతులకు కూడా అతి తక్కువ సమయంలోనే పెట్టుబడి రాయితీని అందిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విపత్తు బాధిత రైతులకు రూ.1,800 కోట్ల పెట్టుబడి రాయితీని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ బకాయిలను విడుదల చేసి రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ తర్వాత కూడా వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు త్వరితగతిన సాయం అందించింది. ఈ ఏడాది సెపె్టంబర్‌ వరకు రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేసింది. ఈ నెలలో భారీ వరదల వల్ల జరిగిన పంట నష్టం అంచనాలను పూర్తి చేసి నవంబర్‌లో బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ అందించేలా  చర్యలు చేపట్టింది. 

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)