amp pages | Sakshi

కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే నోటిఫై చేయండి

Published on Sat, 04/17/2021 - 03:38

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) పరిధిని తక్షణమే నోటిఫై చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ అక్రమంగా చేపట్టిన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి చేర్చవద్దని స్పష్టం చేసింది. పరిధిని నోటిఫై చేయకపోతే కృష్ణా జలాలను ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేయడంలోనూ.. నియంత్రించడంలోనూ బోర్డు సాధికారికంగా విధులు నిర్వర్తించలేదని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు శుక్రవారం లేఖ రాశారు. ‘బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేయాలని గతేడాది అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరారు. బోర్డు పరిధిని నోటిఫై చేస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్‌ అక్రమంగా 5 ప్రాజెక్టులు చేపట్టింది. 3 ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచింది. దీనిపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్‌ శక్తి శాఖకు ఫిర్యాదు చేశాం. ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని తెలంగాణను కేంద్రం ఆదేశించింది. వాటి పనులు ఆపేలా చూడాలని కృష్ణా బోర్డును ఆదేశించింది’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లతో కేంద్ర ఉన్నతాధికారుల సమావేశం 
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధులను నిర్ణయించడానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ శుక్రవారం సాయంత్రం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. రెండు బోర్డుల చైర్మన్లు, కేంద్ర జల్‌ శక్తి శాఖ ఉన్నతాధికారులు వర్చువల్‌ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. బోర్డుల పరిధి ఖరారుపై చర్చించారు. అయితే, ఈ సమావేశం వివరాలను ఉన్నతాధికారులు బయటకు వెల్లడించలేదు.    

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)