amp pages | Sakshi

చెరువు మెరిసి.. చేను మురిసి!

Published on Fri, 03/25/2022 - 22:39

2021–22వ సంవత్సరానికి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 934 మి.మీ కాగా, మునుపెన్నడూ లేని విధంగా అత్యధికంగా రికార్డు స్థాయిలో 1,485 మి.మీ వర్షపాతం నమోదైంది. 2021 ఖరీఫ్‌ సీజన్‌లో 1,90,955 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికి 1,77,075 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు చేశారు. ఇందులో వరి 37,950 హెక్టార్లలో, వేరుశెనగ 94,629 హెక్టార్లలో, ఇతర పంటలు 44,496 హెక్టార్లలో సాగు చేశారని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పంటలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల, చెరువులు నిండు కుండల్లా ఉండటంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. అదే విధంగా వర్షాలకు కురిసిన నీటిని సంరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాజెక్టులు, చెరువుల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను పరిశీలిస్తే..

సాక్షి ప్రతినిధి, తిరుపతి: గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థకు ఆధారాలుగా ఉన్న చెరువులను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.  గత సర్కారు చేసిన తప్పిదాల వల్ల అనేక మంది రైతులు, ప్రజలు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, నూతన చెరువులు, ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ పనులకు వందల కోట్లు వెచ్చిస్తోంది. 

కాలువల తవ్వకానికి రూ.193.23 కోట్లు 
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయం నుంచి గంగాధరనెల్లూరు, పెనుమూరు మండలాల్లోని చెరువులకు నీరు సరఫరా చేసేందుకు వరద కాలువ తవ్వకాలు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.193.23 కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఆ తర్వాత విజయవాడకు చెందిన ఎస్‌ఎల్‌టీసీ అనుమతితో టెండర్‌ ప్రక్రియ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ వరద ప్రవాహ కాలువల ప్రక్రియ పూర్తి కాగానే 2,439 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించనున్నట్లు ఇరిగేషన్‌ అధికారులు చెబుతున్నారు. 

అభివృద్ధి పనులు ఇలా.. 
► శ్రీకాళహస్తి, ఏర్పేడులలో కమ్యూనిటీ బేస్డ్‌ ట్యాంక్స్‌ పునరుద్ధరణ కింద 48 చెరువుల అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.14.40 కోట్లు మంజూరు చేసింది. టెండర్‌ ప్రక్రియ నిర్వహించి పనులు ప్రారంభించనున్నారు. ఈ పనులు పూర్తి కాగానే 13,050 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. 
►  ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో జిల్లా వ్యాప్తంగా 187 చెరువుల అభివృద్ధికి రూ.54.39 కోట్లు మంజూరు చేశారు.  
►  గత ఏడాది నవంబర్‌లో తుఫాను కారణంగా దెబ్బతిన్న 617 చెరువులు, కాలువలు, ఇతర నీటి పారుదల కట్టడాల తాత్కాలిక మరమ్మతులకు రూ.11.37 కోట్లు ఖర్చు చేశారు. ► చిత్తూరు, బంగారుపాళ్యం, గుడిపాల, జీడీనెల్లూరు, సత్యవేడు, వరదయ్యపాళ్యం మండలాల్లో చెరువులు, సరఫరా కాలువల అభివృద్ధికి 15 పనులకు రూ.18.60 కోట్లు మంజూరు చేశారు. ఇవి పూర్తయితే 3,850 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. 
► చిత్తూరు, తవణంపల్లి, ఐరాల, మొలకలచెరువు, కలకడ, గంగాధరనెల్లూరు, గుడిపాల, పెనుమూరు, గుర్రంకొండ, కలికిరి మండలాల్లో చెరువుల అభివృద్ధి పనులకు రూ.13.36 కోట్లు మంజూరు చేశారు. పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే 2,790 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని అంచనా. 
► ఏపీఐఎల్‌ఐపీ–2 పథకంలో భాగంగా 53 చెరువులకు రూ.32.82 కోట్లు మంజూరయ్యాయి. 
► పిచ్చాటూరు మండలంలో అరణియార్‌ ప్రాజెకు పునరుద్ధరణకు రూ.35.64 కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది. కార్వేటినగరంలో కృష్ణాపురం ప్రాజెక్టును ఆధునీకరించేందుకు రూ.31.80 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు. ఈ పనులు పూర్తయితే 26,626.78 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చని ఇరిగేషన్‌ ఎస్‌ఈ విజయ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

చెరువుల అభివృద్ధికి చర్యలు
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడుతోంది. జిల్లా వ్యాప్తంగా పనుల పురోగతిపై ఇరిగేషన్‌ శాఖ అధికారులు, ఇంజనీర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. చెరువులను పునరిద్ధరించడం, ప్రాజెక్టుల పనులతో రైతులకు, ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. జిల్లా మొత్తం మంజూరైన పనులను వేగవంతంగా నిర్వహించి పురోగతి చూపేలా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నాం. 
– హరినారాయణన్, జిల్లా కలెక్టర్‌

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)