అప్రమత్తంగా ఉన్నాం : డీజీపీ సవాంగ్‌

Published on Wed, 12/23/2020 - 15:01

సాక్షి, అమరాతి : కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైందని ఆంధ్రప్రదేశ్‌ డీజేపీ గౌతం సవాంగ్‌ అన్నారు. ఏపీలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ..కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించామని, కలెక్టర్లు, ఎస్పీలతో సంప్రదిస్తున్నామని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీసు స్టేషన‍్లలో పాటు లాకప్‌లతో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ రకమైన నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శీతాకాలం కనుక కోవిడ్‌ జాగ్రత్తలు మరింతగా తీసుకోవాలని ప్రజలకు సూచించారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ