amp pages | Sakshi

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీఎం జగన్‌ 

Published on Mon, 12/12/2022 - 09:22

సాక్షి, అమరావతి: తుపాను, భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతుల పట్ల అత్యంత ఉదారంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. పంట నష్టాల ఎన్యుమరేషన్‌ విషయంలో ఉదారంగా ఉండాలని సూచించారు. తుపాను, భారీ వర్షాలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు.

ఎక్కడా రైతులు నిరాశకు గురి కాకూడదు 
పంట నష్టాల ఎన్యుమరేషన్‌లో రైతులు ఎక్కడా నిరాశకు గురి కాకూడదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. రంగు మారిన ధాన్యమైనా, తడిసిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయట్లేదన్న మాట ఎక్కడా రాకూడదన్నారు. తక్కువ రేటుకు కొంటున్నారన్న మాటే ఎక్కడా వినిపించకూడదని స్పష్టం చేశారు. ఒకవేళ రైతులు బయట విక్రయించదలచినా సరే వారికి రావాల్సిన రేటు (మద్దతు ధర) కంటే ఎక్కువ ధర లభించాల్సిందేనని సూచించారు. ఆ రేటు దక్కేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులదేనన్నారు. తుపాను ప్రభావంతో వర్షాలు కురిసిన జిల్లాల్లో కలెక్టర్లు అంతా ఈమేరకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

80 శాతం సబ్సిడీతో విత్తనాలు
పంటలు దెబ్బ తిన్నచోట మళ్లీ పంటలు సాగు చేసేందుకు వీలుగా 80 శాతం సబ్సిడీతో విత్తనాలను రైతులకు అందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు సబ్సిడీ విత్తనాలు అందాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే బాధిత కుటుంబానికి రూ.2 వేలతో పాటు రేషన్‌ సరుకులు అందించాలని సూచించారు. ప్రభుత్వం పట్టించుకోలేదనే మాటే రాకూడదని, ఇళ్లలోకి నీరు చేరితే కచ్చితంగా వారికి సహాయాన్ని అందించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్లు అంతా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 

బాధితులందరికీ సాయం అందాలి..
పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా బాధితులందరికీ సహాయాన్ని అందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. గోడకూలి ఒకరు మరణించారనే సమాచారం వచ్చిందని, బాధిత కుటుంబానికి వెంటనే పరిహారాన్ని అందించాలని సూచించారు. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగితే ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. నష్ట పరిహారం అంచనాల నమోదును వెంటనే ప్రారంభించి వచ్చే వారం రోజుల్లో ఈ ప్రక్రియను ముగించాలని నిర్దేశించారు. 
పూరిళ్లు/కచ్చా ఇళ్లు కూలిపోయిన బాధితులకు రూ.4,100 చొప్పున, పశువులు చనిపోతే రూ.30 వేలు చొప్పున, చెట్లు కూలిపోతే నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్యుమరేషన్‌ చేపట్టి వారం రోజుల్లోగా పూర్తి చేసి వెంటనే సాయం అందించాలని నిర్దేశించారు. సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ(ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌ జి.సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి వై.మధుసూదన్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి.హరికిరణ్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Videos

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)