amp pages | Sakshi

రివర్స్‌ టెండరింగ్‌లో మరో మైలురాయి

Published on Sun, 05/23/2021 - 04:02

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో మరో మైలు రాయి నమోదైంది. పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) డిజైన్లలో డీడీఆర్పీ (డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేసిన మార్పుల మేరకు చేపట్టిన అదనపు పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి. తద్వారా సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకతను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు చాటి చెప్పింది. మొత్తంగా ఒక్క పోలవరం ప్రాజెక్టు పనులకు నిర్వహించిన రివర్స్‌ టెండరింగ్‌లోనే ఖజానాకు రూ.843.53 కోట్లు ఆదా అయినట్లయింది. కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను ప్రభుత్వం అదనంగా చేపట్టడానికి సంబంధించిన టెండర్‌ షెడ్యూల్‌ను జల వనరుల శాఖ మార్చి 2న జ్యుడిషియల్‌ ప్రివ్యూకు పంపింది. రూ.683 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టడానికి జ్యుడిషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన షెడ్యూల్‌తోనే జల వనరుల శాఖ టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ టెండర్‌లో ఆర్థిక బిడ్‌ను శనివారం తెరిచారు. మేఘా, హెచ్‌ఈఎస్‌ ఇన్‌ఫ్రా సంస్థలు బిడ్‌లు దాఖలు చేసినట్లు వెల్లడైంది. ఆర్థిక బిడ్‌లో రూ.676.24 కోట్లకు కోట్‌ చేసిన సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా పరిగణించి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించారు. రివర్స్‌ టెండరింగ్‌ గడువు ముగిసే సమయానికి రూ.669.47 కోట్లకు కోట్‌ చేసిన మేఘా సంస్థ ఎల్‌–1గా నిలిచింది. ఈ టెండర్‌ను ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి నేతృత్వంలోని ఎస్‌ఎల్‌టీసీ (రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ) పరిశీలించి, ఆమోదించింది. దాంతో ఈ టెండర్‌లో ఖజానాకు రూ.13.53 కోట్లు ఆదా అయ్యాయి.  


పారదర్శకతకు గీటురాయి 
► పోలవరంలో 194.6 టీఎంసీలను నిల్వ చేసే ప్రధాన డ్యామ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌)ను గోదావరి ఇసుక తిన్నెలపై నిర్మిస్తున్నారు. నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి తీరానికి అవతల కుడి వైపున స్పిల్‌వే నిర్మిస్తున్నారు. 
► అత్యంత పటిష్టంగా ప్రాజెక్టును నిర్మించేందుకు డీడీఆర్పీ ప్రతిపాదనల మేరకు సీడబ్ల్యూసీ పలు డిజైన్లను మార్చింది. ఈ క్రమంలో కాంట్రాక్టు ఒప్పందంలో లేని పనులను కొత్తగా చేపట్టడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టమైన హామీ ఇచ్చింది.  
► దీంతో సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్ల మేరకు అదనంగా చేపట్టాల్సిన పనులకు రూ.683 కోట్లతో ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఒక ప్రాజెక్టులో అదనంగా చేపట్టాల్సిన పనులకూ రివర్స్‌ టెండరింగ్‌ విధానం పాటించడం పారదర్శకతకు గీటురాయిగా నిలుస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. 
► 2018 సెప్టెంబర్‌ 18న చింతలపూడి ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచినప్పుడు అదనంగా చేపట్టాల్సిన రూ.563.4 కోట్ల విలువైన పనులను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు నామినేషన్‌పై కాంట్రాక్టు సంస్థలకు అప్పగించి కమీషన్లు వసూలు చేసుకోవటాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. 
► పోలవరం హెడ్‌వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనుల్లో రూ.7,984.93 కోట్ల విలువైన పనులను టీడీపీ హయాంలో నామినేషన్‌పై అప్పగించడాన్ని ఉదహరిస్తున్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)