amp pages | Sakshi

నీటి లభ్యత విపరీతంగా పెరిగింది: మంత్రి అనిల్‌‌

Published on Sun, 09/27/2020 - 19:25

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుభిక్షంగా వర్షాలు పడి, డ్యామ్‌లు నిండటంతో ప్రజలు ఆనందంగా ఉన్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది కన్న ఈ సంవత్సరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్‌ మాట్లాడుతూ.. అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం జిల్లాలో చెరువులు నిండటంతో పాటు రిజర్వాయర్లు నిండుకున్నాయని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు దిగువకు వస్తోందని, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించామని అన్నారు. కాగా ప్రకాశం బ్యారేజీ రాత్రి కి 7 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించామని తెలిపారు.

భారీ వర్షాలకు గ్రౌండ్ వాటర్ పెరగడంతో నీటి లభ్యత విపరీతంగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రైతాంగం సంతోషంగా ఉన్నారని, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే ఖరీఫ్‌లో సైతం రికార్డు స్థాయిలో పంటల దిగుబడులు వస్తాయని  ఆశిస్తున్నామని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. 

మరోవైపు వరద పరిస్థితి పై జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్ టేలికాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఇంతియాజ్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కాగా ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని, కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు, స్నానాలకు వెళ్ళడం చేయరాదని  ఇంతియాజ్ ప్రజలకు సూచించారు.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)