రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
23 నుంచి జోరుగా వానలు
Published on Sun, 06/20/2021 - 04:38
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆదివారం సాయంత్రానికి బలహీనపడే సూచనలున్నాయి. అలాగే ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు అంతగా కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో రానున్న రెండు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. రైతులు వ్యవసాయ పనులు కొనసాగించుకునేందుకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంపై ఆదివారం నుంచి బ్రేక్ మాన్సూన్ ప్రభావం మొదలవుతుందని, దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో మెలమెల్లగా వర్షాలు కురుస్తూ ఈ నెల 23 నుంచి జోరందుకుంటాయని వివరించారు.
#
Tags