amp pages | Sakshi

పత్తి మొత్తం ఒకేసారి అమ్ముకోవచ్చు

Published on Mon, 11/23/2020 - 04:39

సాక్షి, అమరావతి: వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పత్తిని అమ్ముకోలేక బాధపడుతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రంతో సంబంధం లేకుండా నిబంధనలు సడలించింది. రైతులకు సమీపంలోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిన్నింగ్‌ మిల్లులను ఎంపిక చేసింది. పత్తి పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా చూస్తోంది. దాదాపు ఐదులక్షల టన్నుల పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నా కేంద్రం నిబంధనల కారణంగా ఇప్పటివరకు 61 వేల క్వింటాళ్లనే కొనుగోలు చేశారు. పత్తిలో తేమ అధికశాతం ఉండటం, రంగు మారడం వల్ల రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తిని అమ్ముకోలేకపోతున్నారు. రాష్ట్రంలో ఉన్న నిబంధనలను ఆసరాగా చేసుకుని తెలంగాణ వ్యాపారులు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో ప్రభుత్వం నిబంధనలు సడలించింది.  

చకచకా ఫైర్‌ ఎన్‌వోసీలు 
కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేసిన జిన్నింగ్‌ మిల్లులకు అగ్నిమాపకశాఖ అనుమతులు లేకపోవడంతో వాటిని ఖరారు చేయలేదు. అయితే రైతుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఫైర్‌ ఎన్‌వోసి దరఖాస్తులు పరిశీలనలో ఉంటే.. వాటిని ఎంపిక చేస్తున్నారు.

పరిమితి పెంచేందుకు ప్రయత్నాలు 
రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఏడు క్వింటాళ్లు, కొన్ని జిల్లాల్లో 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులు ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్ని ప్రభుత్వానికి వివరించి, ఒక్కో రైతు నుంచి గరిష్టంగా 15 క్వింటాళ్లు కొనుగోలు చేయడానికి అనుమతి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న చెప్పారు.  

నిబంధన ఎత్తివేత 
మండలానికి సగటు దిగుబడిని అంచనావేసి ఒక్కో రైతు వద్ద ఎకరాకు 7 నుంచి 11.87 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ పంటను నవంబర్‌లో 25 శాతం, డిసెంబర్‌లో 50 శాతం, జనవరిలో 25 శాతం పత్తిని కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలి. దీనివల్ల రైతులు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిబంధనను ఎత్తివేసి ఒకేసారి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు.  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)