amp pages | Sakshi

పీజీ ప్రవేశ పరీక్షకు వేళాయె

Published on Wed, 10/20/2021 - 05:33

కర్నూలు కల్చరల్‌: ఏపీ పీజీ సెట్‌–2021కు మొత్తం 42,082 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 15 విశ్వవిద్యాలయాలు, అనుబంధ పీజీ కళాశాలల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ పీజీ సెట్‌–2021)ను నిర్వహిస్తున్నారు. ఒకే పరీక్షతో విద్యార్థులు తమకు ఇష్టమైన వర్సిటీలో తమకు నచ్చిన కోర్సులో చేరేందుకు, ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలతో పాటు అనుబంధ కళాశాలల్లో 145 కోర్సులకు 43,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలతో పాటు హైదరాబాద్‌లోని ఒక కేంద్రంలో పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం 42,082 దరఖాస్తుల్లో అమ్మాయిలు అత్యధికంగా 23,684 మంది దరఖాస్తు చేసుకోగా, అబ్బాయిలు 18,561 మంది, ట్రాన్స్‌జెండర్స్‌ ముగ్గురు ఉన్నారు. ఓసీలు 7,769, బీసీ–ఏ 5,557, బీసీ–బీ 5,969, బీసీ–సీ 406, బీసీ–డీ 9,580, బీసీ–ఈ 1,511, ఎస్సీ 9,363, ఎస్టీ 2,093, పీహెచ్‌ 342 మంది ఉన్నారు.

విశాఖపట్నంలో 5,895, తూర్పు గోదావరిలో 4,677, కర్నూలులో 4,019, కృష్ణాలో 3,431, అనంతపురంలో 3,420, విజయనగరంలో 3,355, పశ్చిమ గోదావరిలో 3,158, చిత్తూరులో 2,816, గుంటూరులో 2,666, వైఎస్సార్‌ కడపలో 2,321, శ్రీకాకుళంలో 2,304, నెల్లూరులో 1,837, ప్రకాశంలో 1,647, హైదరాబాద్‌లో 540 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు కేంద్రాలను ఎంచుకున్నారు.

పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏపీ పీజీ సెట్‌–2021 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ వై.నజీర్‌అహ్మద్‌ పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌లో పరీక్ష జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ముందస్తుగా ఎంపిక చేసుకున్న కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. కోవిడ్‌–19 నిబంధనలను అనుసరించి పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌