వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
ఏపీలో కొత్తగా 1271 కరోనా కేసులు
Published on Thu, 04/01/2021 - 19:52
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 31,809 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,271 మందికి పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,03,260 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 464 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 8,87,898 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం, గుంటూరు, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ముగ్గురు మృతిచెందగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 7,220 మంది మరణించారు. ఏపీలో ప్రస్తుతం 8142 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నేటి వరకు రాష్ట్రంలో 1,51,14,988 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.
చదవండి:
మూడు నెలల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేస్తాం
కరోనా సెకండ్ వేవ్: రాబోయే 45 రోజులు ఎంత కీలకం...?
Tags