మోదమ్మను దర్శించుకున్న న్యాయమూర్తి ప్రకాష్‌బాబు

Published on Sat, 06/03/2023 - 02:26

సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పాడేరులోని మోదకొండమ్మతల్లిని తాడేపల్లిగూడెం అసిస్టెంట్‌ సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి కర్రి ప్రకాష్‌బాబు శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మోదమ్మకు న్యాయమూర్తి ప్రకాష్‌బాబు, అతని భార్య, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు పసుపు, కుంకుమ సమర్పించారు. ఉత్సవ విగ్రహాన్ని తలపై పెట్టుకుని మోశారు.అనంతరం న్యాయమూర్తి దంపతులతో ఆలయ అర్చకులు సుబ్రహ్మణ్యం అమ్మవారికి కుంకుమార్చన పూజలు జరిపించారు. గతంలో ప్రకాష్‌బాబు పాడేరు కోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రకాష్‌బాబు దంపతులకు పాడేరులోని సీనియర్‌ న్యాయవాది బండారు వెంకటరమణ, పాడేరు ఉప సర్పంచ్‌ బూరెడ్డి రామునాయుడులు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి, మోదమ్మ చిత్రపటంతో పాటు ప్రసాదం అందజేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ