amp pages | Sakshi

వేతన సవరణలో గోప్యతా?

Published on Fri, 08/11/2017 - 01:44

విశ్లేషణ
వేతన సంబంధ సమాచారాన్ని కేంద్రప్రభుత్వ సంస్థలు తమంత తామే వెల్ల డించాలి. అడిగినా ఇవ్వకపోవడం అన్యాయం. వేతన సవరణ గురించి అడిగితే అది భద్రత, నిఘాలకు సంబంధించినదని ఎలా వాదిస్తారు?

వేతన స్కేల్‌ సవరించాలని రెండేళ్ల కిందట జారీ చేసిన ఉత్తర్వుల అమలు ఎంతవరకు వచ్చిందని ఒక ఉద్యోగి నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (NTRO)ను అడిగాడు. కొన్ని సంస్థలు ఆర్టీఐ కిందకు రావని నోటిఫై చేసే అధికారాన్ని ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 24 ప్రభుత్వాలకు ఇచ్చింది.  ఎన్‌టీఆర్‌ఓ ఆ విధంగా మినహాయింపు పొందిన సంస్థ కనుక సమాచారం ఇవ్వాల్సిన పని లేదన్నారు. తనకు 2009 ఉత్తర్వు ప్రకారం వేతన బకాయిలు సవరించినప్పటికీ 41 వేల రూపాయలు బాకీ ఉన్నారని ఉద్యోగి ప్రశ్నించాడు.

సెక్షన్‌ 24 కింద పూర్తిగా నోటిఫైడ్‌ సంస్థ కనుక ఏ సమాచారమూ ఇవ్వనవసరం లేదనే వాదం చట్ట విరుద్ధమని కమిషన్‌ తిరస్కరించింది. సెక్షన్‌ 24 పరిధిలోని సంస్థలు కూడా ప్రజాసమాచార అధికారిని నియమించి, సెక్షన్‌ 4(1)(బి) కింద ఇవ్వవలసిన సమాచారమంతా స్వయంగా వెబ్‌సైట్‌లో వెల్లడి చేయాలని కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది. సెక్షన్‌ 4(1)(బి) పదో క్లాజ్‌ ప్రకారం నెలకు అధికారులకు ఉద్యోగులకు ఇచ్చే జీతాల వివరాలను, రెగ్యులేషన్‌లో భాగంగా నష్ట పరిహారం చెల్లింపు వ్యవస్థను కూడా సాధికారికంగా వివరించాల్సి ఉంటుంది. వేతన సంబంధ సమాచారాన్ని తమంత తామే ఈ సంస్థలు వెల్లడించాలి. వేతన సవరణ గురించి అడిగితే అది భద్రత, నిఘాలకు సంబంధించినదని ఎలా వాదిస్తారు? ఈ సమాచారం ఇవ్వకుండా ఆపడానికి సెక్షన్‌ 24 ఉపయోగపడదు.

భద్రత, గూఢచర్యానికి సంబంధించిన సమాచారం చెప్పనవసరం లేదని చట్టం నిర్దేశిస్తే వాటితో సంబంధం లేని మామూలు వ్యవహార సమాచారాన్ని కూడా ఆ క్లాజ్‌ కిందనే చెప్పబోమని అనడం చట్టవిరుద్ధమని అనేక హైకోర్టులు వివరించాయి. వేతన అసమానతల అన్యాయాన్ని ఎదిరించాలంటే అందుకు కావలసిన సమాచారం ఇవ్వాల్సిందే.  అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు సంబంధించిన ఏ సమాచారమైనా సెక్షన్‌ 24(1) కింద నిరోధించడానికి వీల్లేదని 24(2) స్పష్టంగా వివరిస్తున్నది.

సెక్షన్‌ 24 పై కీలక తీర్పులు
ఫస్ట్‌ అప్పిలేట్‌ అథారిటీ, అడిషనల్‌ డీజీపీ, సీఐడీ, హరియాణా వర్సెస్‌ సీఐసీ కేసులో పంజాబ్‌  హరి యాణా హైకోర్టు 2011లో నిఘా, భద్రతలతో సంబంధం లేని సమాచారాన్ని ఆర్టీఐ కింద ఇచ్చి తీరాలని తీర్పు చెప్పింది.  భద్రతకు అవసరమైన మేరకు సమాచారాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మాత్రమే కొన్నిసంస్థలను ఆర్టీఐనుంచి మినహాయించడానికి పార్లమెంటు సెక్షన్‌ 24ను చేర్చింది. కానీ దాని అర్థం రహస్యంగా పాలన జరపాలని కాదని ఆబిద్‌ హుస్సేన్‌ వర్సెస్‌ మణిపూర్‌ రాష్ట్రం కేసులో మణిపూర్‌ హైకోర్టు 2015లో తీర్పు చెప్పింది. మినహాయింపు పొందే సంస్థల జాబితాలో సీబీఐని చేర్చినప్పటికీ దానికి సంబంధించిన ప్రతిసమాచారమూ రహస్యంగా కాపాడాలని అర్థం చేసుకోరాదని వివరించింది. కీలకమైన నిఘా భద్రతల వ్యవహారాల సమాచారాన్ని తప్పిస్తే, మామూలు పాలనా సమాచారం ఆర్టీఐ కింద ఇవ్వవలసిందేనని కోర్టు నిర్ధారించింది.

ఫైరెంబాన్‌ సుధేశ్‌ సింగ్‌ వర్సెస్‌ మణిపూర్‌ కేసులో సెక్షన్‌ 24 పరిధిని మణిపూర్‌ హైకోర్టు మరోసారి వివరించింది. ఆ కేసులో అభ్యర్థి తన సర్వీసు ఫైలుకు సంబంధించిన వివరాలు కోరుతూ, నియామక పత్రాలు, సస్పెన్షన్‌ ఫైలు, డిపార్ట్‌ మెంటల్‌ చర్యలు తీసుకున్న ఫైలు, తొలగింపు ఉత్తర్వు పత్రం మొదలైనవి ఇవ్వాలని ఆర్టీఐ కింద అడిగాడు.  ఆర్టీఐ చట్టంలో ఒక్క సెక్షన్‌ 24 మాత్రమే చదివి ఒక తీర్మానానికి రాకూడదు. మొత్తం చట్టాన్ని పీఠికను ఉద్దేశ పత్రాన్ని కూడా సమగ్రంగా పరిశీలించి సమన్వయించి, అడిగిన సమాచారం ఎటువంటిదో పరీక్షించి భద్రతా, నిఘా వ్యవహారాలకు సంబంధించనిదైతే తప్పనిసరిగా ఇవ్వవలసి ఉంటుం దని హైకోర్టు వివరించింది.

ఆర్టీఐ చట్టం సెక్షన్‌ 24లో మినహాయింపు రూపంలో చాలా స్పష్టంగా ఆర్టీఐ వర్తించని సంస్థలు కూడా అవినీతి మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని చట్టం నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని నిఘా భద్రతా వ్యవహారాలను నెరపే సంస్థలను ఆర్టీఐ పరిధినుంచి పూర్తిగా మినహాయిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసే అధికారం ఉన్నప్పటికీ, ఆ రెండు అంశాలు కాకుండా ఇతర సమాచారం ఇవ్వకుండా నిషేధం విధించలేదనీ, అవినీతి, మానవహక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకుండా దాచే అధికారాన్ని ఈ చట్టం రాష్ట్రాలకు గానీ కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇవ్వలేదని విజిలెన్స్‌ అండ్‌ యాంటీ కరప్షన్‌ డైరెక్టరేట్, సెంట్రల్‌ రేంజ్, ఎస్పి వర్సెస్‌ ఆర్‌ కార్తికేయన్‌ కేసు (ఏఐ ఆర్‌ 2012 మద్రాస్‌ 84)లో మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది.

సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ వర్సెస్‌ ఎం కన్నప్పన్‌ కేసులో మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ డి హరిపరంధామన్‌ (2013 (292) ఇఎల్‌టి 24 (మద్రాస్‌) కేసులో పై తీర్పును ఉటంకిస్తూ నేరవిచారణకు అనుమతించిన ఫైల్‌ నోట్స్‌ తదితర వివరాలను కోరితే ఇవ్వాల్సిందేనని, సెక్షన్‌ 24 సంస్థలు కూడా సెక్షన్‌ 4(1)(బి)5 కింద సమాచారం ఇవ్వవలసి ఉంటుందని నిర్ధారిం చింది. కనుక ఎన్‌టిఆర్‌ఓ అడిగిన సమాచారం ఇవ్వవలసిందేనని కమిషన్‌ ఆదేశించింది. (గెహ్లాట్‌ వర్సెస్‌ ఎన్‌ టీఆర్‌ఓ CIC/ LS/ A-/2012/001368 కేసులో 25 జూలై 2017 ఇచ్చిన తీర్పు ఆధారంగా).


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)