amp pages | Sakshi

ఏపీ, తెలంగాణలకు కేంద్రం కానుక

Published on Wed, 08/24/2016 - 17:48

న్యూఢిల్లీ:  వరంగల్ జిల్లా కాజీపేట నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా బల్లార్షా స్టేషన్ వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని అంచనా వ్యయం 2,063 కోట్ల రూపాయలు కాగా, నిర్మాణం పూర్తయ్యేసరికి 2,403 కోట్ల రూపాయలు కావచ్చని భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది.

201.4 కిలో మీటర్లు పొడవైన ఈ రైల్వే లైన్ ఐదేళ్లలో పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఈ రైల్వే లైన్ తెలంగాణలోని వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాను కవర్ చేస్తుంది. ఈ మార్గంలో పవర్ ప్లాంట్స్, బొగ్గు, సిమెంట్ రవాణా, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మూడో లైన్ను మంజూరు చేశారు. న్యూఢిల్లీ-చెన్నై గ్రాంట్ ట్రంక్ రూట్లో భాగంగా కాజీపేట-బల్లార్షా మూడో లైన్ ఉంటుంది. ఈ రైల్వే లైన్ ద్వారా  జమ్మికుంట ఎఫ్సీఐ, రాఘవపురం కేసోరామ్ సిమెంట్, మంచిర్యాల థర్మల్ పవర్ స్టేషన్, ఎస్సీసీఎల్ నుంచి గూడ్సును రవాణా చేస్తారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, రెచ్నిరోడ్ నుంచి బొగ్గు రవాణా.. మానిక్గఢ్, ఘట్చందూర్ నుంచి సిమెంట్ను ఇదే మార్గంలో రవాణా చేస్తారు.

ఆంధ్రప్రదేశ్లో విజయవాడ-గూడురు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కూడా కేంద్ర కేబినెట్ అనుమతి మంజూరు చేసింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 3246 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చని అంచనా. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదుల దాడి, మతకలహాలు, వామపక్ష తీవ్రవాదుల దాడి, మందుపాతర పేలుడు, సరిహద్దు వద్ద కాల్పుల్లో మరణించిన పౌరుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం అందజేయనుంది. ఈ ఘటనల్లో మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందజేస్తారు. అలాగే తీవ్రంగా గాయపడినవారికి కూడా పరిహారం ఇవ్వనున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌