ప్రత్యేక హోదాపై ఒత్తిడి పెంచేందుకే..

Published on Wed, 08/05/2015 - 02:22

ఢిల్లీ ధర్నాపై వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన
ధర్నా ప్రచార పోస్టర్‌ను  ఆవిష్కరించిన పార్టీ నేతలు

 
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంతోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 10న ఢిల్లీ ధర్నాకు పిలుపునిచ్చిందని ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఆయనతోపాటు పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, సాగి దుర్గాప్రసాదరాజు, అంబటి రాంబాబు, కొత్తపల్లి సుబ్బారాయుడు, వాసిరెడ్డి పద్మ, పుత్తా ప్రతాప్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ ధర్నా ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ధర్మాన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగే అన్యాయ్యాన్ని సరిదిద్దడానికే ప్రత్యేకహోదా అంశం పుట్టుకొచ్చిందన్నారు. అది కేవలం హామీ మాత్రమే కాదని.. అన్యాయం జరిగిన ప్రాంతానికి న్యాయం చేయడం లాంటిదని చెప్పారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా మొదట్నుంచీ ప్రత్యేక హోదా సాధనకోసం వైఎస్సార్‌సీపీ పోరాడుతోందని.. దానికి కొనసాగింపుగానే ఢిల్లీ ధర్నాకు పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టకపోవడం రాష్ట్ర ప్రజలందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తోందన్నారు. టీడీపీ కేంద్రప్రభుత్వంలో భాగస్వామిగా, రాష్ట్రంలో అధికారంలో ఉండి చంద్రబాబు దీనిపై ఎందుకు మాట్లాడడం లేదని ధర్మాన ప్రశ్నించారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు దీనిని చిన్న విషయంగా భావిస్తున్నారని తప్పుపట్టారు. నష్టపోయిన ప్రజలపక్షాన ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఢిల్లీ ధర్నాలో రాష్ట్ర ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నుంచి తరలివెళ్లిన కార్యకర్తల తో ధర్నా నిర్వహించిన అనంతరం ర్యాలీగా పార్లమెంట్ వైపునకు వెళ్లే కార్యక్రమం ఉంటుందని బొత్స సత్యనారాయణ చెప్పారు.
 

Videos

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

మన ప్రశ్నలకు బాబు, పురందేశ్వరి, పవన్ కు పిచ్చి, పిచ్చి కోపం వస్తుందంటా..!

వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!

కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు

జనంతో కిక్కిరిసిన మైదుకూరు

జగన్ గెలుపుకు అర్ధం..!

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఓడిపోవడం ఖాయం

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ @మైదుకూరు

Watch Live: మైదుకూరులో సీఎం జగన్‌ ప్రచార సభ

Photos

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)