అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రూ. 2,858 కోట్ల విలువైన ఎఫ్డీఐ ప్రతిపాదనలకు ఆమోదం
Published on Thu, 03/26/2015 - 01:38
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డ్ (ఎఫ్ఐపీబీ) తాజాగా రూ.2,858 కోట్ల విలువైన 10 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రతిపాదనలను ఆమోదించింది. ఆర్థిక మంత్రిత్వశాఖ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో షేర్ఖాన్ లిమిటెడ్, ఐడీఎఫ్సీ, ఓస్ట్రో ఎనర్జీలకు సంబంధించిన ఎఫ్డీఐ ప్రతిపాదనలున్నాయి.
రూ.3,500 కోట్ల విలువైన షేర్ల మార్పిడి విధానం ద్వారా తన హోల్డింగ్ కంపెనీ హోల్సిమ్ (ఇండియా)లో 24 శాతం వాటాలు కొనడానికి సంబంధించి అంబుజా సిమెంట్స్ ప్రతిపాదనను మాత్రం సీసీఈఏ (ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ)కి నివేదించింది. ఎఫ్డీఐ ప్రతిపాదనలను ఎఫ్ఐపీబీ క్లియర్ చేస్తుంది. అయితే రూ. 1.200 కోట్ల పైబడిన ఎఫ్డీఐ ప్రతిపాదనకు సీసీఈఏ తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంటుంది.
#
Tags