వల్లభనేని వంశీ తో సాక్షి స్ట్రెయిట్ టాక్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏపీ స్పీకర్ కోడెలకు రఘువీరా లేఖ
Published on Thu, 07/30/2015 - 20:38
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరా రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీ లాంజ్ నుంచి తొలగించిన వైఎస్ఆర్ చిత్రపటాన్న పునఃప్రతిష్టించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఏముందంటే..
'ముఖ్యమంత్రి హోదాలో మరణించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని ఆనాటి సభాపతి అనుమతితో ప్రతిష్టించారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అసెంబ్లీ అధికారులు వైఎస్సార్ చిత్రపటాన్ని తొలగించడమనేది సీఎం హోదాను అవమానపరచడమే. రాజకీయాలకు అతీతంగా సీఎం హోదాను గౌరవించడం సంప్రదాయం. అధికార టీడీపీ ఒత్తిడికి లోను కాకుండా స్పీకర్గా స్వతంత్రంగా వ్యవహరించి.. వైఎస్సార్ ఫొటోను పునఃప్రతిష్టించాలి' అని లేఖలో రఘువీరా రెడ్డి కోరారు.
#
Tags