అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
రాష్ట్రపతి మెడల్ కోసం వెళుతుంటే దొంగతనం
Published on Thu, 09/03/2015 - 14:19
న్యూఢిల్లీ: ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఢిల్లీకి బయలు దేరిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్... రైల్లో చోరీ బారిన పడ్డారు. గ్వాలియర్ నగరానికి చెందిన సురేఖా సక్సేనా.. ఓ కేంద్రీయ విద్యాలయంలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఆమె రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు ఎంపిక కావడంతో ఆ అవార్డు తీసుకునేందుకు తన సోదరుడు సురేందర్ సక్సేనాతో కలసి సమతా ఎక్స్ ప్రెస్ ఏసీ టూ టైర్ రైలులో బయలుదేరారు.
రైలు మధుర స్టేషన్లో ఆగగానే చాయ్ అంటూ వచ్చిన ఓ వ్యక్తి వారికి చాయ్ పోసినట్లుగా పోసి సడెన్గా ఓ స్ప్రే బాటిల్ తీసి వారిపై ప్రయోగించారు. వారు అతడిని అడ్డుకునే ప్రయత్నంలో పడ్డారు. ఈలోపే అతడు పారిపోయాడు. అనంతరం చూసుకున్న వారికి ఆమె పర్సు, సోదరుడి గోల్డ్ వాచ్ పోయినట్లు తెలిసి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#
Tags